Supreme Court: ‘ఎయిర్ ఇండియా’ ఘటన.. కేంద్రం, డీజీసీఏలకు నోటీసులు!
ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటన చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే, ఈ తరహా ఘటనల్లో వ్యవహరించాల్సిన తీరుపై మార్గదర్శకాల రూపకల్పనకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ సదరు ప్రయాణికురాలు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించింది.
దిల్లీ: ఎయిర్ ఇండియా (Air India) విమానంలో తోటి ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ తరహా ఘటనలను నివారించడంతోపాటు వాటి విషయంలో వ్యవహరించాల్సిన తీరుపై మార్గదర్శకాల (SOPs) రూపకల్పనకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ ఆ ప్రయాణికురాలు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణకు సుప్రీం కోర్టు (Supreme Court) అంగీకరించింది. ఈ క్రమంలోనే కేంద్రం, డీజీసీఏ (DGCA)లతోపాటు అన్ని విమానయాన సంస్థల (Airliners)కు నోటీసులు జారీ చేసింది. వేసవి సెలవుల తర్వాత జులైలో వ్యాజ్యంపై విచారణ చేపడతామని తెలిపింది.
ఘటనానంతరం తన విషయంలో ఎయిర్ ఇండియా, డీజీసీఏలు సరైన రీతిలో వ్యవహరించలేదని ఆరోపిస్తూ.. మార్చిలో ఆమె సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 2014- 23 వరకు విమాన ప్రయాణికుల అనుచిత ప్రవర్తనలకు సంబంధించిన ఏడు ఘటనలనూ ప్రస్తావించారు. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ వ్యాజ్యాన్ని పరిశీలించింది. ఈ కేసులో 72 ఏళ్ల వృద్ధురాలు ఇబ్బంది పడ్డారని సీజేఐ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కేంద్రం, డీజీసీఏలతోపాటు ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగో, గో ఎయిర్లైన్స్(ఇండియా) లిమిటెడ్, ఆకాశ ఎయిర్, స్పైస్జెట్ లిమిటెడ్లకు నోటీసులు జారీ చేశారు.
ఇదిలా ఉండగా.. గతేడాది నవంబరులో న్యూయార్క్ నుంచి దిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై శంకర్ మిశ్రా అనే వ్యక్తి మద్యం మత్తులో మూత్ర విసర్జన చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మిశ్రాను పోలీసులు జనవరి 6న బెంగళూరులో అరెస్టు చేశారు. తదనంతరం దిల్లీ కోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు