కరోనా కాలం.. అక్కడి వృద్ధులకు అలారం
చైనా నుంచే కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. దీంతో అమెరికాలో చైనీయులపై అమెరికన్లు కర్కశంగా వ్యవహరించడం.. వేధింపులకు గురి చేయడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో న్యూయార్క్ సిటీలోని
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి చైనాలో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికాలో చైనీయులను వేధించడం, దాడులకు పాల్పడటం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయట. ఈ నేపథ్యంలో న్యూయార్క్ సిటీలోని చైనా టౌన్లో వృద్ధ చైనీయుల రక్షణ కోసం అక్కడి యువత ఒక విధమైన అలారం పరికరాలను తయారు చేయిస్తోంది.
కరోనా వ్యాప్తికి చైనా దేశం కారణమంటూ అమెరికాలో ఉండే చైనీయులపై అక్కడి ప్రజలు వివక్ష చూపిస్తున్నారట. వారి వల్లే అమెరికాలోకి కరోనా ప్రవేశించిందని ఆరోపిస్తూ భౌతిక దాడులకు కూడా పాల్పడుతున్నారట. ఇలాంటి ఘటనలను చూసిన న్యూయార్క్ చైనా టౌన్లోని కొందరు యువతీయువకులు వృద్ధుల రక్షణ గురించి ఆలోచించారు. వయసులో ఉన్నవారు దాడిని ప్రతిఘటించే అవకాశముంది. కానీ వృద్ధులను కాపాడటం ఎలా అనే సమస్యకు పరిష్కారం ఆన్వేషించారు. దానికి ఫలితమే ఈ అలారం పరికరం. ఇందుకోసం మార్చిలో చైనా టౌన్లోని యువతీయువకులు స్థానికులకు సమస్యను వివరించి పరికరం తయారీకి ఆర్థిక సాయం కోరారు. అక్కడి ప్రజలు సహాయం చేయడంతో ‘సేఫ్ ఫ్రమ్ హేట్’ కార్యక్రమం చేపట్టారు.
ఇందులో భాగంగా ఈ పరికరాలను తయారు చేయించి.. వృద్ధులకు పంపిణీ చేస్తున్నారు. వాటిని ఎలా ఉపయోగించాలో నేర్పిస్తున్నారు. ఈ అలారం పరికరాన్ని వృద్ధులు ఎల్లప్పుడు వారి వద్దనే ఉంచుకోవాలి. దుండగులు దాడి చేసేందుకు వస్తే వెంటనే ఈ పరికరంలోని మీట నొక్కాలి. అది నొక్కగానే దాదాపు 125 డెసిబుల్స్తో శబ్దం వినిపిస్తుందట. ఆ శబ్దానికి దుండగులు కాస్త బెదిరిపోయి అచేతనంగా ఉండిపోతారని, ఆ సమయంలో వారి నుంచి తప్పించుకొని బయటకు రావొచ్చని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం