IMA: దగ్గు కేసులు.. యాంటీబయాటిక్స్ వాడకంపై హెచ్చరిక!
దగ్గు, జలుబు, వికారం వంటి కేసుల్లో విచక్షణారహితంగా యాంటీబయాటిక్స్ వాడొద్దని ఐఎంఏ సూచించింది. వీటిలో చాలా కేసులకు ఇన్ఫ్లుయెంజా ఏ సబ్టైప్ ‘హెచ్3ఎన్2(H3N2)’ వైరస్ కారణమవుతోందని ఐసీఎంఆర్ వెల్లడించింది.
దిల్లీ: కొన్నాళ్లుగా దేశవ్యాప్తంగా నిరంతర దగ్గు(Persistent Cough) కేసులు, కొన్ని సందర్భాల్లో జ్వరంతోకూడిన దగ్గు కేసులు నమోదవుతున్నాయి. అయితే, వీటిలో చాలా కేసులకు ‘ఇన్ఫ్లుయెంజా ఏ’ ఉప రకం ‘హెచ్3ఎన్2(H3N2)’ వైరస్ కారణమవుతోందని భారత వైద్య పరిశోధన మండలి(ICMR) నిపుణులు వెల్లడించారు. గత రెండు, మూడు నెలలుగా ఇది విస్తృతంగా వ్యాప్తిలో ఉందని తెలిపారు. ఇతర సబ్టైప్లతో పోల్చితే ఇది ఎక్కువగా ఆసుపత్రిలో చేరికలకు కారణమవుతోందని చెప్పారు.
మరోవైపు.. దేశవ్యాప్తంగా దగ్గు, జలుబు, వికారం కేసులు పెరుగుతున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) గుర్తించింది. అయితే, వాటి చికిత్సకు యాంటీబయాటిక్స్ (Antibiotics)ను విచక్షణారహితంగా వాడొద్దని సూచించింది. ‘ఈ ఇన్ఫెక్షన్ సాధారణంగా అయిదు నుంచి వారం రోజుల వరకు ఉంటుంది. మూడు రోజుల్లో జ్వరం తగ్గిపోతుంది. దగ్గు మూడు వారాల వరకు ఉంటుంది. 15 ఏళ్లలోపు, 50 ఏళ్లు పైబడిన వారు ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. వాయు కాలుష్యం కూడా కేసుల పెరుగుదలకు కారణమవుతోంది’ అని తెలిపింది.
ఈ ఇన్ఫెక్షన్లతో బాధపడుతోన్న రోగులకు యాంటీబయాటిక్స్ కాకుండా రోగ లక్షణాలకు మాత్రమే చికిత్స అందించాలని వైద్యులకు సూచించింది. ‘ప్రస్తుతం ప్రజలు అజిత్రోమైసిన్, అమోక్సిక్లావ్ వంటి యాంటీబయాటిక్స్ను ఇష్టారాజ్యంగా వాడుతున్నారు. ఇది యాంటీబయాటిక్స్ నిరోధకతకు దారి తీస్తుంది. కాబట్టి, వాటి వాడకాన్ని నిలిపేయాలి. లేనిపక్షంలో, అవసరమైన సందర్భాల్లో అవి పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది’ అని ఐఎంఏ ఒక ప్రకటనలో పేర్కొంది.
డయేరియా, మూత్రనాళ ఇన్ఫెక్షన్ల చికిత్సకు ఉపయోగించే అమోక్సిసిలిన్, నార్ఫ్లోక్సాసిన్, ఒప్రోఫ్లోక్సాసిన్, ఆఫ్లోక్సాసిన్, లెవోఫ్లోక్సాసిన్ వంటి యాంటీబయాటిక్స్లను విపరీతంగా వాడుతున్నారని తెలిపింది. ‘కొవిడ్ సమయంలో అజిత్రోమైసిన్, ఐవర్మెక్టిన్లను విస్తృతంగా వినియోగించారు. ఇది కాస్త.. యాంటీబయాటిక్ నిరోధకతకు దారితీసింది. ఈ నేపథ్యంలో రోగులకు యాంటీబయాటిక్స్ సూచించే ముందు.. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా? కాదా? అని నిర్ధారించుకోవడం అవసరం’ అని ఐఎంఏ సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం