Bharat Jodo Yatra: కర్ణాటకలో రాహుల్ పోస్టర్ల చించివేత.. ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు
కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన రాహుల్ గాంధీ పోస్టర్లు చించివేయడం కలకలం రేపింది. ఇది అధికార పార్టీ పనేనని కాంగ్రెస్ ఆరోపించింది.
బెంగళూరు: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో పాదయాత్ర (Bharat Jodo Yatra) శుక్రవారం కర్ణాటకలోకి ప్రవేశించనుంది. ఆయన పర్యటనకు ఒక్కరోజు ముందు రాహుల్కు ఆహ్వానం పలుకుతూ కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన పోస్టర్లు చించివేయడం కలకలం రేపింది. ఇది అధికార పార్టీ పనేనని కాంగ్రెస్ ఆరోపించింది.
సెప్టెంబర్ 7న ప్రారంభమైన భారత్ జోడో యాత్ర తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పూర్తయ్యింది. రేపటి నుంచి కర్ణాటకలోకి ప్రవేశపెట్టనుంది. రాహుల్ పర్యటన నేపథ్యంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా కేరళ సరిహద్దు జిల్లా అయిన చామరాజనగరలో రాహుల్కు స్వాగతం పలుకుతూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. అయితే, రాహుల్తో పాటు కర్ణాటక కాంగ్రెస్ నేతలున్న పోస్టర్లను ఎవరో గుర్తు తెలీని వ్యక్తులు చించివేశారు.
ఇది ముమ్మూటికీ ‘40 శాతం కమీషన్ బొమ్మై సర్కారు పనే’ అంటూ కాంగ్రెస్ ఆరోపించింది. భారత్ టోడో (భాజపానుద్దేశించి) గూండాల పనే ఇది అంటూ కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి రణ్దీప్ సూర్జేవాలా ఆరోపించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, అసమానతలు, విభజనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరును ఎవరూ ఆపలేరని ట్వీట్ చేశారు. కొన్ని పోస్టర్లను చించివేయడంతో పాటు మరికొన్నింటిని తగలబెట్టారని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆరోపించారు. ఎన్ని చేసినా తాము తలొగ్గేది లేదని, ఆ విషయాన్ని భాజపా గమనించాలని డీకే శివకుమార్ విలేకరులతో అన్నారు. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ వారు జోక్యం చేసుకోకుంటే తర్వాత ఏం చేయాలన్నది తాము చూస్తామని చెప్పారు. ఈ వ్యవహారంపై పోలీస్స్టేషన్లో ఆ పార్టీ ఫిర్యాదు చేసింది. దీనిపై సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. ఎవరు ‘భారత్ జోడో’ చేస్తున్నారో ఎవరు ‘టోడో’ చేస్తున్నారో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. ఎవరి పోస్టర్లూ చించాల్సిన అవసరం భాజపాకు లేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం