Bihar: లాలూజీ.. మీ ఇంట్లోకి పాము మళ్లీ చొరబడింది..!
అనేక రాజకీయ నాటకీయ పరిణామాల తర్వాత బిహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతోంది. భాజపాతో బంధాన్ని తెంచుకున్న జేడీ(యు) నేత నీతీశ్ కుమార్.. కొద్ది సేపట్లోనే ఆర్జేడీతో జట్టుకట్టి పూర్వ సంబంధాలను
నీతీశ్తో పొత్తు నేపథ్యంలో భాజపా కౌంటర్
పట్నా: అనేక రాజకీయ నాటకీయ పరిణామాల తర్వాత బిహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతోంది. భాజపాతో బంధాన్ని తెంచుకున్న జేడీ(యు) నేత నీతీశ్ కుమార్.. కొద్ది సేపట్లోనే ఆర్జేడీతో జట్టుకట్టి పూర్వ సంబంధాలను పునరుద్ధరించుకున్నారు. అయితే నీతీశ్ తీరుపై భాజపా నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ట్విటర్ వేదికగా.. లాలూ ప్రసాద్ యాదవ్ను ఉద్దేశిస్తూ కొత్త పొత్తుపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఐదేళ్ల క్రితం లాలూ చేసిన ఓ ట్వీట్ను ఉటంకిస్తూ ‘‘మీ ఇంట్లోకి పాము చొరబడింది’’ అని రాసుకొచ్చారు. కేంద్రమంత్రి ట్వీట్ వెనుక ఉద్దేశమేంటంటే..
2017లో ఆర్జేడీతో తెగదెంపులు చేసుకున్న నీతీశ్ కుమార్.. భాజపాతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నీతీశ్ను ఉద్దేశిస్తూ లాలూ అప్పుడు ఓ ట్వీట్ చేశారు. ‘‘నీతీశ్ ఓ పాము లాంటి వ్యక్తి. పాము ఎలాగైతే కుబుసం విడుస్తుందో.. నితీశ్కు కూడా ప్రతి రెండేళ్లకోసారి కొత్త చర్మం వస్తుంది. ఇందులో ఏమైనా సందేహాలున్నాయా?’’ అని అప్పట్లో జేడీ(యు) నేతపై మండిపడ్డారు. ఈ ట్వీట్ను ప్రస్తావిస్తూ కేంద్రమంత్రి గిరిరాజ్ విమర్శలు గుప్పించారు. ‘‘ఆ పాము ఇప్పుడు మీ ఇంట్లోకి మళ్లీ చొరబడింది’’ అంటూ చురకలంటించారు.
2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జేడీ(యు), ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి మహా కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో విజయం సాధించాయి. అప్పుడు నీతీశ్ సీఎం అవ్వగా.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే రెండేళ్లకే వీరి బంధానికి ముగింపు పలుకుతూ నీతీశ్ కూటమి నుంచి తప్పుకొన్నారు. ఆ తర్వాత భాజపాతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2020 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో మళ్లీ నీతీశ్ సీఎం అయ్యారు.
అయితే కూటమి ప్రభుత్వానికి తానే సారథ్యం వహిస్తున్నప్పటికీ.. భాజపా పార్టీ తన మాటను చెల్లుబాటు కానివ్వట్లేదని గతకొంతకాంగా నీతీశ్ అసంతృప్తిగా ఉన్నారు. తన రాజకీయ మనుగడకు కాషాయ పార్టీ నుంచి ముప్పు పొంచి ఉందని భావించి.. వెంటనే తన రాజకీయ చతురతను ఉపయోగించారు. భాజపాతో బంధాన్ని తెంచుకుని.. మళ్లీ ఆర్జేడీతో చేతులు కలిపారు. కొత్త పొత్తు చర్చల సందర్భంగా నీతీశ్.. తేజస్వీతో మాట్లాడుతూ.. గతమంతా మర్చిపోదామని, కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దామని చెప్పినట్లు ఆర్జేడీ వర్గాలు వెల్లడించాయి. కూటమి నుంచి వైదొలిగి తాను పొరబాటు చేశానని, అందుకు తనను క్షమించాలని కోరినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం