corona:అధ్యక్షుడు ప్రసంగిస్తుంటే..గిన్నెలతో శబ్దం
సాక్షాత్తూ దేశాధ్యక్షుడు ప్రసంగిస్తోన్న వేళ..ప్రజలు గిన్నెలతో పెద్ద శబ్దాలు చేసుకుంటూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
బ్రెజిల్లో బొల్సొనారో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
బ్రెసిలియా: సాక్షాత్తూ దేశాధ్యక్షుడు ప్రసంగిస్తోన్న వేళ..ప్రజలు గిన్నెలతో పెద్ద శబ్దాలు చేసుకుంటూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం బ్రెజిల్లోని పలు నగరాల్లో గిన్నెల శబ్దాలు వినిపించాయి. మహమ్మారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధ్యక్షుడు జైర్ బొల్సొనారో పట్ల ఆ దేశస్థులు ఈ రకంగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయమై ఇటీవల వీధుల్లోకి వచ్చి ప్రజలు ఆందోళన చేపట్టారు.
బొల్సొనారో కరోనా వైరస్ను మొదటి నుంచి చిన్నచూపు చూశారు. చిన్నపాటి ఫ్లూ అంటూ కొట్టిపారేశారు. ఆ నిర్లక్ష్యం బ్రెజిల్ను వణికించింది. ఒకదశలో నాలుగువేలకు పైగా మరణాలు సంభవించాయి. నిన్న కూడా దాదాపు లక్ష కేసులు, రెండు వేలకు పైగా మరణాలు నమోదయ్యాయని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఇక, బుధవారం టెలివిజన్ ప్రసంగంలో బొల్సొనారో మాట్లాడుతూ..తన ప్రభుత్వ విజయాల గురించి చెప్పుకొచ్చారు. ఆర్థిక వృద్ధి గురించి మాట్లాడారు. అయితే కొత్త విషయాల గురించి మాత్రం ఏ ప్రస్తావనా తేలేదు. ఈ ప్రసంగం సమయంలోనే ప్రజలు గిన్నెలతో శబ్దాలు చేస్తూ నిరసన తెలిపారు.
కరోనా కారణంగా ప్రజల నుంచి ఆయన ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. శనివారం దేశవ్యాప్తంగా 16 నగరాల్లో వేల సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు ఈ నిరసనలో పాల్గొన్నాయి. అతి పెద్ద నగరమైన సావోపాలోలో అయితే ఏకంగా రక్త పిశాచి అని రాసి ఉన్న బెలూన్లను ప్రదర్శించి ప్రజలు తమ ఆవేదనను వెళ్లగక్కారు. వరల్డో మీటర్ గణాంకాల ప్రకారం..బ్రెజిల్లో 1,67,20,081 మందికి కరోనా సోకగా..4,67,706 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల పరంగా మూడో స్థానంలో ఉన్న ఆ దేశం..మరణాల విషయంలో రెండో స్థానానికి చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!