చాపకింద నీరులా చైనా నిఘా సంస్థలు..!
చైనా జనాభా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో స్థిరపడ్డారు. దీంతో వారిని వాడుకొని డ్రాగన్ భారీగా సమాచారం సేకరిస్తోంది. ప్రస్తుత జాతీయ భద్రత సలహాదాలు అజిత్ దోబల్ 2013లో చైనా నిఘా కార్యకలాపాలపై ఒక పత్రాన్ని రాశారు.
హాన్ జున్వే అరెస్టుతో మరోసారి వెలుగులోకి
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
చైనా జనాభా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో స్థిరపడింది. దీంతో వారిని వాడుకొని డ్రాగన్ భారీగా సమాచారం సేకరిస్తోంది. ప్రస్తుత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోబల్ 2013లో చైనా నిఘా కార్యకలాపాలపై ఒక అధ్యయనపత్రాన్ని రాశారు. చైనా వ్యాపార సంస్థలు, మీడియా, బ్యాంకులు, 180 దేశాల్లోని కన్ఫ్యూషియస్ సంస్థలను వాడుకొంటుందని తెలిపారు. తాజాగా భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పట్టుబడిన చైనా దేశస్థుడు హాన్ జున్వే పదేళ్లకు పైగా గూఢచారిగా పనిచేస్తున్నాడని తేలింది. అతను హోటల్ నిర్వహిస్తుండటం గమనార్హం. అసలే సరిహద్దు వివాదం రగులుతున్న సమయంలో చైనా గూఢచర్య కార్యకలాపాలు ఆందోళనకరంగా మారాయి.
ఎక్కడా సమాచారం ఉండదు..
ప్రపంచంలోనే అతి శక్తివంతమైన గూఢచర్య నెట్వర్క్ చైనాకు ఉంది. కానీ, అది చాలా నిశ్శబ్దంగా పనిచేస్తుంది. ఎటువంటి ప్రచార ఆర్భాటం ఉండదు. వీరు ప్రత్యర్థి దేశాలకు చెందిన కీలక వ్యవస్థల్లోకి చొరబడి ఉంటారు. అక్కడి చట్టాలను వాడుకొంటారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ స్టడీస్కు చెందిన డాక్టర్ సుభాష్ కపిల దాదాపు 20 ఏళ్ల కిందటే చైనా ఇంటెలిజెన్స్ సర్వీస్ పనితీరును విశ్లేషించారు.
చైనా నిఘా సంస్థను ‘మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సర్వీస్’ అని పిలుస్తారు. నిఘా సంస్థ అంటే రహస్యంగానే ఉండాలి.. అన్న సిద్ధాంతాన్ని చైనా బలంగా నమ్ముతుంది. అందుకే ఈ సంస్థ గురించి ఎక్కడా సమాచారం లభించదు. దానికి సంబంధించిన ఎటువంటి పుస్తకాలు కూడా పబ్లిష్ చేయదు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా దీనిపై చర్చకు అవకాశం ఉండకుండా చేస్తుంది. దీంతో ఈ సంస్థపైకి ఎవరి దృష్టి పెద్దగా ఉండదు. భారత్లో కూడా మీడియా,రాజకీయ నాయకులు పాక్ ఇంటెలిజెన్స్ సర్వీసుపై ఎక్కువ దృష్టి నిలుపుతారు కానీ, చైనా విషయం పట్టించుకోరు. వాస్తవానికి బ్రిటిష్ పాలకుల సమయం నుంచే చైనా వేగులు భారత్లో పనిచేయడం మొదలుపెట్టారు. రెండో ప్రపంచ యుద్ధంలో చైనా పశ్చిమ దేశాల పక్షాన నిలవడంతో దాని వేగులకు భారత్లో పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. జపాన్కు వ్యతిరేకంగా బ్రిటిష్వారికి వీరు సాయపడ్డారు. యుద్ధ సమయంలో భారత్లో ఉన్న వేగులతో 1949 తర్వాత చైనా ఏర్పడ్డాక అవసరమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను అభివృద్ధి చేశారు.
1950,1960 సమయంలో చైనా ఇంటెలిజెన్స్ సంస్థలు భారత్లో కొన్ని కీలక ఆపరేషన్లు నిర్వహించాయి. టిబెట్ ఆక్రమణ సమయంలో భారీ సంఖ్యలో ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ను అక్కడకు తరలించింది. వారు ఆక్రమణ తర్వాత ఇండో-టిబెట్ సరిహద్దుల్లో స్థిరపడ్డారు. ఆ తర్వాత భారత్లోగూఢచర్యం మొదలు పెట్టారు. టిబెట్లోని లాసాలో బోర్డర్ అఫైర్స్ ఆఫీస్ పేరుతో ఒక నిఘా కార్యలయాన్ని చైనా తెరిచింది. దాదాపు నాలుగు వందల మందిని ఇందులో నియమించింది. 1960 నుంచి ఈశాన్య భారత్లో వేర్పాటు వాదానికి చైనా ఇంటెలిజెన్స్ సంస్థలే కారణం అయ్యాయి. అప్పట్లో భారత్ రష్యాతో సన్నిహతంగా ఉండేది. దీంతో అమెరికాకు చెందిన సీఐఏ, చైనాకు చెందిన సీఐఎస్లు భారత్కు వ్యతిరేకంగా చేతులు కలిపాయి. చైనా నిఘా సంస్థలు భారత్లోని కొన్ని కీలక సమాచారాలను సేకరించడంపైనే దృష్టిపెడతాయి.
* అణ్వాయుధ మోహరింపులు, కమాండ్ కంట్రోల్ వివరాలు.
* క్షిపణుల అభివృద్ధి కార్యక్రమం, మోహరింపులు, సామర్థ్యాలు.
* భారత సైన్యంలో ఐటీ పరంగా చేస్తున్న మార్పులు చేర్పులు.
* అంతరిక్ష రంగంలో భారత పరిశోధనలు. ఉపగ్రహాల నిఘా సమాచారం.
* భారత్-అమెరికా సంబంధాలపై ఎక్కువ దృష్టిపెడుతుంది.
కొన్నాళ్ల కిందట గ్రీకు పత్రిక పెంటాపోస్టాగ్మా చైనా గూఢచర్యంలోని ఓ భాగాన్ని వెలుగులోకి తెచ్చింది. చైనా ‘వెయ్యి ఇసుక రేణువులు’ (థౌజండ్ గ్రెయిన్స్ ఆఫ్ శాండ్) విధానంలో సమాచార సేకరణ చేస్తుందని వెల్లడించింది. వేర్వేరు మార్గాల్లో సేకరించిన సమాచారాన్ని ఒక దగ్గరచేర్చి విశ్లేషించడమే దీని ప్రత్యేకత.
చైనా జిన్హూవా అనే న్యూస్ ఏజెన్సీ ఇంటెలిజెన్స్లో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోందని ఆ పత్రిక వెల్లడించింది. జిన్హూవా వార్తా సంస్థకు ఎనిమిది వేర్వేరు భాషల్లో దాదాపు 20 పత్రికలు.. డజను మ్యాగ్జైన్లు ఉన్నాయి. వివిధ దేశాల్లో దాదాపు 107 బ్యూరోలు పనిచేస్తున్నాయి. ఈ సంస్థకు విదేశాల్లోనే దాదాపు 10,000 మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు.
ఇది చైనా కమ్యూనిస్టు పార్టీ , నాయకులకు సంబంధించి సానుకూల ప్రచారం చేస్తుంది. దీంతోపాటు వారిపై వచ్చే వ్యతిరేక కథనాలను సాధ్యమైనంత వరకు ఆదిలోనే తుంచివేస్తుంది. జిన్హూవా న్యూస్ ఏజెన్సీ ప్రపంచంలోని వివిధప్రాంతాల్లో వార్తలను కవర్ చేస్తుంది. అదే సమయంలో చైనాకు, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వానికి అవసరం అనుకొన్న వార్తలపై నివేదికలు తయారు చేసి చైనా స్టేట్ సెక్యూరిటీ మినిస్ట్రీకి పంపిస్తుంది.
అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే చైనా విద్యార్థులను నిఘా కార్యకలాపాలకు వాడుకొంటుంది. అమెరికా విశ్వవిద్యాలయాల్లోని చైనా విద్యార్థులపై నిఘా ఉంచడానికి అక్కడి కన్ఫ్యూషియాస్ ఇన్స్టిట్యూట్లను వాడుకొంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటా విజేతగా నిలిస్తే?.. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
భారత్లో ఎత్తయిన ప్రాంతాల్లోని చిన్నారులకు స్టంటింగ్ ముప్పు
వయసుకు తగ్గట్లు శారీరక ఎదుగుదల లోపించే (స్టంటింగ్) ముప్పు భారత్లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని, తాజా అధ్యయనం తేల్చింది. -
దక్షిణాదిలో నీటి సంక్షోభం!
దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్ పేర్కొంది. -
రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు
దేశ రాజధాని దిల్లీలోని నగరపాలక సంస్థ (ఎంసీడీ) పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంపై నగరపాలక సంస్థను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలదీసింది. -
భారతీయులకే అమెరికాలో సీఈవో అవకాశం!
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు హైకోర్టు నిరాకరణ
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ ఆరోపించిన తెలిసిందే. -
కేంద్ర చట్టంపై దిల్లీ ప్రభుత్వ సవాలు విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా
దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కట్టపెడుతూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
సిసోదియా జ్యుడిషియల్ కస్టడీ 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోదియా, సహ నిందితుడు విజయ్ నాయర్, ఇతరుల జ్యుడిషియల్ కస్టడీని శుక్రవారమిక్కడి న్యాయస్థానం మే ఎనిమిదో తేదీ వరకు పొడిగింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా చెక్ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.