వ్యాక్సిన్ తీసుకున్న వైద్యులు ఏం చెబుతున్నారు?
కరోనా నివారణకు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం మూడో రోజూ కొనసాగుతోంది. ఈ నెల 16న ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టగా.. .
దిల్లీ: కరోనా నివారణకు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం మూడో రోజూ కొనసాగుతోంది. ఈ నెల 16న ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టగా.. కరోనా యోధులకు తొలి ప్రాధాన్యంగా టీకా అందిస్తున్న విషయం తెలిసిందే. దేశీయంగా అభివృద్ధి అయిన కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను వైద్య, పారిశుద్ధ్య, పోలీస్ శాఖలకు చెందిన సిబ్బందికి తొలుత అందిస్తున్నారు. ఇందులో భాగంగా టీకా తీసుకున్న అనంతరం దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా, బెంగళూరు, ముంబయికి చెందిన పలువురు వైద్యులు తమ అనుభవాలను పంచుకున్నారు.
నాకెలాంటి సైడ్ఎఫెక్ట్స్ రాలేదు: గులేరియా
టీకా వేయించుకున్న రెండు రోజుల తర్వాత దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా తన అనుభవాన్ని వెల్లడించారు. ఈ టీకా తీసుకున్న తర్వాత తనకెలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎదురుకాలేదని స్పష్టంచేశారు. ఉదయం నుంచి తాను పనిలోనే నిమగ్నమయ్యానన్న ఆయన.. యథావిథిగా సమావేశాలకు కూడా హాజరవుతున్నట్టు చెప్పారు. కరోనా మరణాల రేటును మరింతగా తగ్గించేందుకు ప్రజలంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలి
టీకా పంపిణీతో దేశంలో ఓ పండుగ వాతావరణం ఏర్పడిందని బెంగళూరుకు చెందిన వైద్యుడు సందేశ్ ఖండేవాల్ అన్నారు. బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చి ఇన్స్టిట్యూట్లో న్యూరో సర్జన్గా పనిచేస్తున్న ఆయన విక్టోరియా ఆస్పత్రిలో టీకా తీసుకున్నారు. టీకా పంపిణీలో ఎలాంటి ఆలస్యం జరగలేదన్నారు. ఇప్పటివరకు తనకెలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని, ఇంజెక్షన్ చేసిన చోట ఎలాంటి నొప్పీ లేదన్నారు. టీకా వేయించుకొనే ముందు రోజే తనకు సంబంధిత ఆస్పత్రి నుంచి సందేశం వచ్చిందన్నారు. అలాగే, కరోనా వార్డులో పనిచేస్తున్న తనను టీకా వేయించుకొనేందుకు ఫోన్ కూడా వచ్చినట్టు తెలిపారు. ఉదయం 9గంటల వరకు సిద్ధంగా ఉండాలని చెప్పారని ఆయన వివరించారు. ప్రతి ఫ్రంట్లైన్ యోధుడూ తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా కరోనా ఇన్ఫెక్షన్ వేరొకరికి సోకకుండా కనీసం ఓ వారధిలాగైనా ఉండగలుగుతామని చెప్పారు.
అసత్యాలు నమ్మొద్దు
తొలి రోజు కరోనా వ్యాక్సిన్ వేయించుకొని రెండున్నర గంటల తర్వాత కూడా తనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రి ఛైర్మన్ సుదర్శన్ భల్లాల్ తెలిపారు. వైద్య రంగంలో ఈ రోజు రక్తాక్షరాలతో లిఖించదగిన రోజుగా అభివర్ణించారు. తాను వ్యాక్సినేషన్ సెంటర్లోకి వెళ్లినప్పటి నుంచి వచ్చేదాకా అంతా ప్రశాంతగా జరిగిందన్నారు. లోపలికి వెళ్లగానే తనకు ప్రొసీజర్ను వివరించారని, సైడ్ఎఫెక్ట్స్ గురించి కూడా చెప్పారన్నారు. వ్యాక్సిన్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత దాదాపు అరగంట పాటు అబ్జర్వేషన్లో ఉంచారని తెలిపారు. ప్రతిఒక్కరూ టీకా తమ వంతు వచ్చినప్పడు టీకా వేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
టీకాలతో సైడ్ ఎఫెక్ట్ల గురించి వస్తోన్న ఊహగానాలు, అసత్యాలను నమ్మొద్దని ఆయన కోరారు. ఈ టీకాలను అభివృద్ధి చేసిన మన శాస్త్రవేత్తలపై విశ్వాసం ఉంచాలన్నారు. టీకా వేయించుకున్న తర్వాత కూడా భౌతికదూరం పాటించడం, మాస్క్లు ధరించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ విషయంలో అజాగ్రత్త పనికిరాదన్నారు. దేశం నుంచి కరోనాను తరిమికొట్టేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.
నా జీవితంలో ఇదో చరిత్రాత్మక దినం
ముంబయిలోని సియాన్ ఆస్పత్రి, వైద్యకళాశాల డీన్ మోహన్ జోషీ టీకాను అందుకున్నారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న వారిలో 42మంది వివిధ విభాగాధిపతులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో కలిసి ఆయన టీకా పొందారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీకా సురక్షితమైనదని తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలందరూ తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. టీకా పంపిణీ ప్రారంభమైన రోజు తన జీవితంలో చరిత్రాత్మకమైన దినమన్నారు. అలాగే, రెస్పిరేటరీ మెడిసిన్ డిపార్ట్మెంట్కు చెందిన డాక్టర్ నీలకంఠ్ అవాడ్ మాట్లాడుతూ.. కరోనా అంతానికి వ్యాక్సినేషన్ సహకరిస్తుందన్నారు. కానీ భౌతికదూరం, మాస్క్లు ధరించడం వంటి జాగ్రత్తలు కొనసాగించాలని సూచించారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాకు సియాన్ ఆస్పత్రిలో జరిపిన క్లినికల్ ట్రయల్స్ను ఈయనే నిర్వహించారు.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటా విజేతగా నిలిస్తే?.. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
భారత్లో ఎత్తయిన ప్రాంతాల్లోని చిన్నారులకు స్టంటింగ్ ముప్పు
వయసుకు తగ్గట్లు శారీరక ఎదుగుదల లోపించే (స్టంటింగ్) ముప్పు భారత్లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని, తాజా అధ్యయనం తేల్చింది. -
దక్షిణాదిలో నీటి సంక్షోభం!
దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్ పేర్కొంది. -
రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు
దేశ రాజధాని దిల్లీలోని నగరపాలక సంస్థ (ఎంసీడీ) పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంపై నగరపాలక సంస్థను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలదీసింది. -
భారతీయులకే అమెరికాలో సీఈవో అవకాశం!
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు హైకోర్టు నిరాకరణ
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ ఆరోపించిన తెలిసిందే. -
కేంద్ర చట్టంపై దిల్లీ ప్రభుత్వ సవాలు విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా
దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కట్టపెడుతూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
సిసోదియా జ్యుడిషియల్ కస్టడీ 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోదియా, సహ నిందితుడు విజయ్ నాయర్, ఇతరుల జ్యుడిషియల్ కస్టడీని శుక్రవారమిక్కడి న్యాయస్థానం మే ఎనిమిదో తేదీ వరకు పొడిగింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా చెక్ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.