ఏ పేరు లేకుండానే ఆ పథకం: కేజ్రీవాల్‌

నేరుగా వినియోగదారుల ఇంటికే రేషన్‌ సరకులు అందించాలనే పథకానికి దిల్లీ కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ఘర్‌ ఘర్‌ యోజన అని నామకరణం చేసిన ఈ పథకానికి కేంద్రం గతంలో అడ్డు చెప్పింది. దీంతో ఏ పేరు లేకుండానే ఈ

Published : 25 Mar 2021 01:08 IST

దిల్లీ: నేరుగా వినియోగదారుల ఇంటికే రేషన్‌ సరకులు అందించాలనే పథకానికి దిల్లీ కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ఘర్‌ ఘర్‌ యోజన అని నామకరణం చేసిన ఈ పథకానికి కేంద్రం గతంలో అడ్డు చెప్పింది. దీంతో ఏ పేరు లేకుండానే ఈ పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఈ పథకం మార్చి 25 నుంచి అమలు కానున్నట్లు తెలిపింది. అయితే కొత్తగా ప్రవేశపెట్టిన పథకం ద్వారా గోధుమలు, బియ్యం, చక్కెరను బ్యాగుల్లో ప్యాక్‌ చేసి వినియోగదారుల ఇంటికే పంపిణీ చేయనున్నట్లు వివరించింది.
‘ఈ పథకానికి పేరు పెట్టడం లేదు. కేంద్ర ప్రభుత్వం రేషన్‌ షాపుల ద్వారా వినియోగదారులకు సరకులు అందిస్తోంది. కానీ మా ప్రభుత్వం నేరుగా వినియోగదారుల ఇంటికే రేషన్‌ అందించనుంది. ఈ పథకానికి పేరు పెట్టడం ఉపయోగకరం కాదు. అందుకే పేరు ప్రస్తావించకుండానే ఈ పథకాన్ని అమలు చేయనున్నాం. ఇందులో మా ప్రభుత్వానికి ఎలాంటి క్రెడిట్‌ అక్కరలేదు. దీన్నీ కేబినెట్‌ మీటింగ్‌ అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపుతాం. దీనికి కేంద్రం ఎటువంటి అడ్డంకి చెప్పదని ఆశిస్తున్నామని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గత శనివారం చెప్పారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని