Sanjay Raut: శివసేనకు మరో షాక్.. సంజయ్రౌత్కు ఈడీ నోటీసులు
మహారాష్ట్రలో తిరుగుబాటు నేతల నుంచి ఇప్పటికే తీవ్ర సవాల్ను ఎదుర్కొంటోన్న శివసేన (Shiv Sena)కు తాజాగా మరో షాక్ తగిలింది.
ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నామన్న రెబల్ నేతలు
ముంబయి: మహారాష్ట్రలో తిరుగుబాటు నేతల నుంచి ఇప్పటికే తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోన్న శివసేన (Shiv Sena)కు తాజాగా మరో షాక్ తగిలింది. మనీలాండరింగ్ (Money Laundering) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut)ను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సిద్ధమైంది. ఇందులో భాగంగా మంగళవారం నాడు హాజరు కావాలని ఆయనకు ఈడీ నోటీసులు జారీచేసింది.
మహారాష్ట్రలోని పాత్రచాల్ (Patra Chawl) అభివృద్ధి ప్రాజెక్టులో భూకుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. రూ.1,034 కోట్ల విలువైన ఈ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారంలో సంజయ్రౌత్కు సన్నిహితుడైన ప్రవీణ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అరెస్టు చేయడంతోపాటు ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. ఈ కేసులో సంజయ్తోపాటు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.2కోట్ల విలువైన ఆస్తులను ఈ ఏప్రిల్లో ఈడీ జప్తు చేసింది. ఆయన భార్యపేరుమీదున్న అలీబాగ్లోని ఎనిమిది స్థలాలు, ముంబయిలోని దాదర్ సబర్బన్లో ఓ ఫ్లాట్ను అటాచ్ చేసింది. తాజాగా ఆయనను ప్రశ్నించేందుకు సిద్ధమైన ఈడీ.. మంగళవారం హాజరుకావాలని ఆదేశించింది.
మైనారిటీలో మహా ప్రభుత్వం..?
శివసేన అసమ్మతి నేతల తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో గత ఆరు రోజులుగా వేచిచూసే ధోరణి అవలంబిస్తోన్న రెబల్ నేతలు నేడు కీలక నిర్ణయం తీసుకున్నారు. మహావికాస్ అఘాడీ (MVA) ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి నోటీసులు జారీ చేసిన 38 మంది రెబల్ ఎమ్మెల్యేలు.. ఇక సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడినట్లేనని అందులో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434