హైదరాబాద్ పోలీసులేం చేశారో అలా చేస్తేనే..: మాజీ సీఎం కుమారస్వామి
Mysuru gang-rape Case: 2019లో హైదరాబాద్లో జరిగిన దిశ ఘటనలో నిందితుల్ని అక్కడి పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. చెన్నపట్నలో శుక్రవారం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. దిశ అత్యాచారం కేసులో హైదరాబాద్ పోలీసులు వ్యవహరించిన తీరును ప్రశంసించారు. ......
బెంగళూరు: మైసూరు నగర శివారులో ఎంబీఏ విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ దారుణ ఘటనను మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి ఖండించారు. విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 2019లో హైదరాబాద్లో జరిగిన దిశ ఘటనలో నిందితుల్ని అక్కడి పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. చెన్నపట్నలో శుక్రవారం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. దిశ అత్యాచారం కేసులో హైదరాబాద్ పోలీసులు వ్యవహరించిన తీరును ప్రశంసించారు. ఆ కేసులో నిందితుల పట్ల హైదరాబాద్ పోలీసులు వ్యవహరించినట్టే మైసూరులో విద్యార్థినిపై రేప్ కేసు ఘటనలో దోషులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. హైదరాబాద్ పోలీసుల చర్యలను అనుసరించాలని సూచించారు. ఇలాంటి నేరాల్లో దోషులపై కఠిన చర్యలు తీసుకోకపోతే పరిస్థితులు మెరుగుపడవన్నారు.
మైసూరులో జరిగిన అత్యాచారం కేసులో ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించాలని, ఈ విషయంలో హైదరాబాద్ పోలీసుల చర్యల్ని అనుసరించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగకుండా ఆపలేకపోతున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై విమర్శలు గుప్పించారు. గ్రామాల్లో జూద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. ప్రస్తుత వ్యవస్థ నేరాలను ప్రోత్సహించేలా ఉందన్న కుమారస్వామి.. నేరాలకు పాల్పడి జైలుకు వెళ్తున్న వారు కొన్ని రోజుల్లోనే బెయిల్పై బయటకు వచ్చేస్తున్నారన్నారు. నేరాలు చేసినా తమకేం కాదనే నమ్మకంతో వారు వ్యవహరిస్తున్నారన్నారు.
మరోవైపు, కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్ మాట్లాడుతూ.. దారుణాలకు పాల్పడిన వారిని నరికి వేస్తే ఇలాంటివి పునరావృతం కావని వ్యాఖ్యానించారు. భాజపా సీనియర్ నేత, మాజీ సీఎం యడియూరప్ప స్పందిస్తూ.. ఈ కేసులో పోలీసులు నిజాయతీగా వ్యవహరిస్తున్నారని, తమ శక్తికి మించి పనిచేస్తున్నారన్నారు. త్వరలోనే నేరస్థుల్ని పట్టుకొని శిక్షిస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఈ ఘటనలో దోషుల్ని ఉరితీయాలని బెళగావి గ్రామీణ కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాల్కర్ డిమాండ్ చేశారు. ఇన్ని రోజులైనా నేరస్థుల్ని పోలీసులు ఇంకా పట్టుకోకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం