Presidential Election: ఇద్దరు వ్యక్తులు కాదు.. రెండు సిద్ధాంతాల మధ్య పోరు!
రాష్ట్రపతి పదవికి (Presidential Election) జరుగుతోన్న ఈ ఎన్నికల్లో నెలకొన్న ఈ పోటీ ఇద్దరు వ్యక్తుల మధ్య కాదని.. కేవలం రెండు సిద్ధాంతాల మధ్యేనని విపక్షపార్టీలు పేర్కొన్నాయి.
యశ్వంత్ సిన్హా వెంట విపక్షపార్టీల నేతలు
దిల్లీ: రాష్ట్రపతి పదవికి (Presidential Election) జరుగుతోన్న ఈ ఎన్నికల్లో నెలకొన్న ఈ పోటీ ఇద్దరు వ్యక్తుల మధ్య కాదని.. కేవలం రెండు సిద్ధాంతాల మధ్యేనని విపక్షపార్టీలు పేర్కొన్నాయి. విపక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతి రేసులో ఉన్న యశ్వంత్ సిన్హా (Yashwant Sinha) నామినేషన్ దాఖలు చేసిన అనంతరం విపక్ష నేతలు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
‘యశ్వంత్ సిన్హాకు ఉమ్మడిగా మేమంతా మద్దతు ఇస్తున్నాం. వ్యక్తిగతంగా మద్దతు ఇస్తున్నప్పటికీ పోటీ మాత్రం రెండు సిద్ధాంతాల మధ్యే. ద్వేషపూరిత ఆర్ఎస్ఎస్ ఓవైపు.. దయాభావం కలిగిన ప్రతిపక్ష పార్టీలు మరోవైపు’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. ఇక టీఎంసీ నేత మమతా బెనర్జీ కూడా సిన్హాకు తన మద్దతు ప్రకటించారని ఆ పార్టీ నేత సౌగతా రాయ్ వెల్లడించారు. ఇది కేవలం మతతత్వం-లౌకికతత్వం, నిరంకుశత్వం-ప్రజాస్వామ్యం మధ్య జరుగుతోన్న పోరు అన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో రాష్ట్రపతిగా యశ్వంత్ సిన్హానే ఉత్తమమైన అభ్యర్థి అని టీఎంసీ నేత స్పష్టం చేశారు.
రాష్ట్రపతి పదవికి జరుగుతోన్న ఈ పోటీ గుర్తింపు రాజకీయాలకు సంబంధించినది కాదని సీపీఐ-ఎం నేత సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ద్రౌపది ముర్ము (Draupadi Murmu) అంటే గౌరవం ఉన్నప్పటికీ.. సిద్ధాంతాల నడుమే అసలైన పోటీ అని స్పష్టం చేశారు. మరోవైపు అధికార ఎన్డీయే కూటమి ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పట్ల వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న నిరంకుశ విధానాల వల్లే భాజపా ప్రతిపాదించిన అభ్యర్థిని తిరస్కరిస్తూ యశ్వంత్ సిన్హాను విపక్షాలు బలపరుస్తున్నాయని వెల్లడించారు.
ఇదిలాఉంటే, రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీపడుతోన్న యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ వేశారు. దిల్లీలోని పార్లమెంట్ భవనంలో రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి ఈ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సమయంలో ఆయన వెంట కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్పవార్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా, తెరాస నేత కేటీఆర్తోపాటు పలువురు విపక్షనేతలు ఉన్నారు. అయితే, బీఎస్పీ, బీజేడీ ఇప్పటికే ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు తమ మద్దతును ప్రకటించిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434