Hydrogen Car: భారత్లో తొలి హైడ్రోజన్ కారు..!
భారత్లో తొలి హైడ్రోజన్ కారు అందుబాటులోకి వచ్చింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ కారు పనితీరును కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేడు ప్రయోగాత్మకంగా పరిశీలించారు.
పార్లమెంట్ వరకు ప్రయాణించిన కేంద్ర మంత్రి నీతిన్ గడ్కరీ
దిల్లీ: ప్రస్తుతం విరివిగా వాడుతోన్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయ ఇంధనాన్ని తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. వనరులు తరిగిపోవడం, పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్తోపాటు ఎలక్ట్రిక్ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ ఇంధన వినియోగంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్లో తొలి హైడ్రోజన్ కారు అందుబాటులోకి వచ్చింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ కారు పనితీరును కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేడు ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఆయన నివాసం నుంచి పార్లమెంటు వరకు హైడ్రోజన్ కారులో ప్రయాణించారు.
పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ ఇంధన వాడకాన్ని కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తోంది. ఇందులో భాగంగా దేశంలో తొలి హైడ్రోజన్ కారును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గత నెలలోనే విడుదల చేశారు. సమర్థవంతమైన, పర్యావరణ రహిత, స్వయం ఆధారిత ఇంధన మార్గంలో భారత్ పయనించేందుకు ఈ గ్రీన్ హైడ్రోజన్ ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. జపాన్ సంస్థ టయోటా అందించిన ఈ కారును.. పైలట్ ప్రాజెక్ట్ కింద తానే మొదటగా వినియోగిస్తానని అప్పట్లో వెల్లడించారు. తద్వారా ప్రజలను ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. ఆ ప్రకారమే నేడు దిల్లీ రోడ్లపై తొలి హైడ్రోజన్ కారులో కేంద్రమంత్రి ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ట్విటర్లో స్పందించిన ఆయన. ‘భారత్ త్వరలోనే గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతి చేసే దేశంగా మారనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి, క్లీన్ ఎనర్జీకి అనుగుణంగా ‘నేషనల్ హైడ్రోజన్ మిషన్’ కార్యక్రమం ద్వారా స్వచ్ఛమైన, గ్రీన్ ఎనర్జీని అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని పేర్కొన్నారు.
హైడ్రోజన్ కారు ఫీచర్స్ ఇవే..
* భారత్లో ‘టయోటా మిరాయ్ (Toyota Mirai)’ పేరుతో ఈ హైడ్రోజన్ కారును టయోటా అందుబాటులోకి తీసుకువచ్చింది.
* హైడ్రోజన్ ‘ఫ్యుయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ (FCEV)’ సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు.
* అధిక పీడనం కలిగిన ట్యాంకులో హైడ్రోజన్ను నిల్వ చేస్తారు.
* ఫ్యుయల్ సెల్ సహాయంతో హైడ్రోజన్, ఆక్సిజన్ వాయువుల ప్రతిచర్య కారణంగా విద్యుత్శక్తి ఉత్పత్తి అవుతుంది.
* ఇలా స్వచ్ఛమైన హైడ్రోజన్ నుంచి ఉత్పత్తయ్యే శక్తితో కేవలం నీరు మాత్రమే బయటకు విడుదల అవుతుంది. దీంతో కాలుష్యానికి ఆస్కారం ఉండదు.
* ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 600 కి.మీ వరకు ప్రయాణించవచ్చు.
* ఒక కి.మీ ప్రయాణానికి దాదాపు రూ.2 మాత్రమే అవుతుంది.
* ట్యాంకు నింపడం కూడా కేవలం రెండు, మూడు నిమిషాల్లోనే అవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం