Taliban in Afghanistan: అమెరికా వదిలేసిన ‘టైం’బాంబ్.. అఫ్గాన్..!
అఫ్గానిస్థాన్ గడ్డ పై నుంచి చివరి అమెరికన్ సైనికుడు కూడా నిన్న రాత్రే వెళ్లిపోయారు. తాలిబన్ ప్రత్యేక దళాలు కాబుల్ ఎయిర్పోర్టును ఆక్రమించుకొన్నాయి.
తాలిబన్లకు పాలన ఆషామాషీ కాదు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
అఫ్గానిస్థాన్ గడ్డ పై నుంచి చివరి అమెరికన్ సైనికుడు కూడా నిన్న రాత్రే వెళ్లిపోయారు. తాలిబన్ ప్రత్యేక దళాలు కాబుల్ ఎయిర్పోర్టును ఆక్రమించుకొన్నాయి. అక్కడ అమెరికా పనికిరాకుండా చేసి వదిలేసిన విమానాలు, హెలికాప్టర్లను పరిశీలించారు. అనంతరం గాల్లోకి తుపాకులు కాల్చి సంబరాలు కూడా చేసుకొన్నారు. ఇక తాలిబన్ల చేతికి అఫ్గాన్ పగ్గాలు పూర్తిగా వచ్చేశాయి. దేశాన్ని పరిపాలించి.. ప్రజల సమస్యలను తీర్చాల్సిన సమయం ఆసన్నమైంది. తాలిబన్లకు ఇదే అసలైన సవాలు.
వార్లార్డ్స్, జాతినేతల ముఠాలను కలిపి తాలిబన్లు అంటారు. ఒకరు చెప్పిన మాట మరో వర్గం వినాల్సిన సమయం.. అప్పుడే సమన్వయం ఉంటుంది. ఉదాహరణకు..‘మహిళలతో ఎలా ప్రవర్తించాలో మా ఫైటర్లకు తెలియదు.. కొన్నాళ్లు ఇళ్లలోనే ఉండండి’ అంటూ కొన్నాళ్ల క్రితం తాలిబన్ ప్రతినిధి చేసిన ప్రకటన వారిలోని సమన్వయ లోపానికి చిహ్నం. తాలిబన్ ప్రతినిధిగా ఉన్న వ్యక్తికి పట్టుఉంటే ‘మహిళలను ఏమీ అనవద్దు’ అని ఫైటర్లను ఆదేశిస్తే చాలు. కానీ, అతను అలా చేయలేదు. పాలన మొత్తం ఇదే పరిస్థితి కొనసాగితే మళ్లీ 1990ల నాటి దుస్థితి తలెత్తుతుంది.
ప్రజల అనుమానాలను తీర్చి నమ్మకం కలిగించాలి..
తాలిబన్లు కాబుల్ను ఆక్రమించిన సమయంలో శాంతి మంత్రం పఠించారు. తాము మారిపోయామని వారు చెప్పిన మాటలను ప్రజలు విశ్వసించేలా భవిష్యత్తులో వారి ప్రవర్తన ఉండాలి. 1996 నుంచి 2001 మధ్యలో వీరు మహిళలు, మైనారిటీలపై చేసిన అరాచకాలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఈసారి పాలనలో తాలిబన్లు ఉదారవాదాన్ని తెస్తామని ప్రపంచానికి చెప్పారు.
అన్ని వర్గాలకు పాలనలో భాగస్వామ్యం..
ఇప్పటికే దేశంలో ప్రభుత్వం కూలిపోయి రెండు వారాలవుతోంది. తీవ్రమైన అస్థిరత రాజ్యమేలుతోంది. ఎవరు ఏమిటో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్ల చర్చలు కొలిక్కి రాలేదు. ఐరాసతో సహా పలు ప్రపంచ దేశాలు అఫ్గాన్ పాలనలో దేశంలోని అన్ని వర్గాలకు భాగస్వామ్యం ఉంటేనే గుర్తిస్తామని చెబుతున్నాయి. తాలిబన్లు కూడా దీనిపై సానుకూలంగానే స్పందించారు. ఇప్పటికే మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, మాజీ నేత అబ్దుల్లా అబ్దుల్లా, గుల్బుద్దీన్ హిక్మత్యార్ వంటి నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే షియా వర్గాలతో చర్చలు జరిపేందుకు ప్రతినిధులను పంపారు. అంతేకాదు.. వీరితో జరిగే ఒప్పందాలను దీర్ఘకాలం కొనసాగించకపోతే అంతర్యుద్ధం తప్పదు.
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే..
అఫ్గాన్ ఆర్థిక పరిస్థితే అన్నిటికంటే అధ్వానంగా ఉంది. చెప్పుకోదగ్గ పరిశ్రమలు లేకపోవడం, 9 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం అమెరికా సీజ్ చేయడంతో నిధుల కొరత తీవ్రంగా ఉంది. దేశంలో మంచినీటి వ్యవస్థ, కమ్యూనికేషన్లు, రోడ్ల నిర్వహణ, ఉద్యోగుల జీతాలు వంటి వాటికి కూడా నిధులు లేవు.
దీనికి తోడు విదేశాల నుంచి వచ్చే సహాయ నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. బ్యాంకుల్లో నుంచి డబ్బు తీసుకొనేందుకు ప్రజలు ఏటీఎంల ఎదుట బారులు తీరిననట్లు బీబీసీ పేర్కొంది.
అఫ్గాన్ జీడీపీలో దాదాపు 40శాతం విదేశీ సహాయ నిధులే కావడం గమనార్హం. చాలా దేశాలు అఫ్గాన్ నిధులు మంజూరును సస్పెండ్ చేశాయి. ఈ ప్రభావం తాలిబన్ కరెన్సీపై ప్రతికూలంగా పడుతుంది. చాలా తక్కువ దేశాలు మాత్రమే అఫ్గానిస్థాన్లో దౌత్య కార్యాలయాలను కొనసాగిస్తున్నాయి. దీంతో పాక్,ఇరాన్,చైనా,కతర్,రష్యాలపైనే తాలిబన్లు ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఉగ్రమూకకు అడ్డాగా మారకుండా..
అమెరికా పై యుద్ధం పేరుతో ఇప్పటికే దాదాపు 10వేల మంది పాక్ ఉగ్ర మూకలు అఫ్గాన్ గడ్డపై తిష్టవేశాయి. దీనికి తోడు ఒసామా బిన్ లాదెన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన అమిన్ ఉల్ హక్ ఇప్పటికే అఫ్గాన్లోని నాంగ్రహార్ ప్రావిన్స్కు చేరుకొన్నాడు. అతను అల్-ఖైయిదా ఆయుధ కొనుగోలు విభాగానికి అధ్యక్షుడు కూడా. తాలిబన్- అల్ ఖైయిదా మధ్య సాంస్కృతిక, వివాహ సంబంధాలు ఉన్నట్లు ఐరాస నివేదిక పేర్కొంది. ఇక ఐసిస్-కె ఉండనే ఉంది. ఈ ఉగ్ర సంస్థ దాడుల నుంచి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత తాలిబన్లపై పడింది. ఇన్నాళ్లు ఆ పని నాటో దళాలు చూసేవి. వారికున్న సాంకేతికత.. ఇంటెలిజెన్స్ సమాచారం.. కమ్యూనికేషన్లు తాలిబన్లకు లేవనే చెప్పాలి. ఇక అఫ్గాన్ భూభాగాన్ని విదేశీ శక్తులు వాడుకోకుండా చూస్తామని తాలిబన్లు చెప్పిన మాట ఎంత వరకు నిలబెట్టుకొంటాయో చూడాలి. వాస్తవానికి దీని అమలు ఆధారంగానే విదేశీ సహాయ నిధులు లభించే అవకాశం ఉంది.
నిపుణుల వలసలు..
తాలిబన్ల ఆక్రమణ మొదలు కాగానే.. అఫ్గాన్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న డాక్టర్లు ,అధ్యాపకులు, ఇంజినీర్లు, విశ్వవిద్యాలయ విద్యార్థులు, బ్యూరోక్రాట్లలో అత్యధిక మంది దేశం దాటేశారు. ఈ మేధోవలస దీర్ఘకాలం పాటు అఫ్గాన్ అభివృద్దిని కుంటుబరచనుంది. ఒక దశలో పరిస్థితి అర్థం చేసుకొన్న తాలిబన్ ప్రతినిధి మేధావులు దేశం వీడొద్దని కోరారు. డాక్టర్లు, ఇంజినీర్ల అవసరం దేశానికి ఉందని వారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి
తన కుమారుడు నామినేషన్ వేసిన సందర్భంగా భాజపా ఎంపీ బ్రిజ్ భూషణ్ (Brij Bhushan) తన బలాన్ని ప్రదర్శించారు. వేల సంఖ్యలో మద్దతుదారులతో భారీ సభను నిర్వహించారు. -
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
Hamida Banu: ఈ రోజు గూగుల్ డూడుల్ చూశారా? అందులో కన్పిస్తున్న వ్యక్తి భారత మహిళా రెజ్లర్ హమీదా బాను. ఇంతకీ ఎవరామే? ఏంటామె ప్రత్యేకత? -
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
ముందు రాయ్బరేలీలో గెలువు అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి తాను చేసిన పోస్టుపై గ్యారీ కాస్పరోవ్ (Garry Kasparov) వివరణ ఇచ్చారు. -
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
కేరళలోని కొచ్చిన్లో ఓ యువతి తాను జన్మనిచ్చిన శిశువును రోడ్డుపైకి విసిరేసింది. 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని అపార్ట్మెంట్ బాత్రూమ్లో శుక్రవారం ఉదయం శిశువుకు జన్మనిచ్చింది. -
వీఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) విశ్వవిద్యాలయంలో 2024 విద్యా సంవత్సరం ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. -
దిగుతుండగా కూలిన హెలికాప్టర్
శివసేన(యూబీటీ) నేత సుష్మా అంధారేకు ప్రమాదం తప్పింది. ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. -
దిల్లీ మద్యం విధానం కేసులో మరో అరెస్టు
దిల్లీ మద్యం విధానంతో ముడిపడిన నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా వినోద్ చౌహాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. -
భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 85, 86 దుర్వినియోగాన్ని నివారించాలి
మహిళల పట్ల క్రూరత్వ చర్యలను అడ్డుకొనే లక్ష్యంతో భారతీయ న్యాయ సంహితలో చేర్చిన సెక్షన్ 85, 86 దుర్వినియోగాన్ని నివారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. -
సహనమే వివాహబంధానికి పునాది
పరస్పర గౌరవం, సర్దుబాటు, సహనం దృఢమైన వివాహ బంధానికి పునాదులని సుప్రీంకోర్టు పేర్కొంది. చిన్న చిన్న వివాదాలు, విభేదాలు, అపనమ్మకాలతో... స్వర్గంలో నిర్ణయమైనదిగా భావించే పవిత్ర వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితికి తెచ్చుకోవద్దని హితవు పలికింది. -
కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం
దేశ రాజధానిలో ఎన్నికల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ అంశంపై వాదనలు వింటామని సుప్రీంకోర్టు పేర్కొంది. -
‘ రాహుల్గాంధీ’ పేరుందని పోటీ వద్దంటే ఎలా?
ఎన్నికల్లో ఒకే పేరుతో ఉన్న వ్యక్తులు ఒకే స్థానం నుంచి పోటీ చేయకుండా నిషేధం విధించాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. -
కేజ్రీవాల్ అరెస్టుపై పిటిషన్ను కొట్టేసిన దిల్లీ హైకోర్టు
మద్యం విధానం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను దిల్లీ హైకోర్టు కొట్టేసింది. -
రూ.7.5 లక్షల పరిహారం ఇవ్వండి
పార్కులో ఉదయపు నడకకు వెళ్లిన వ్యక్తి.. వీధి కుక్కల దాడిలో గాయపడి మరణించిన ఘటనలో బాధితుడి కుటుంబసభ్యులకు రూ.7.5 లక్షల పరిహారం ఇవ్వాలని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) ఆదేశించింది. -
ఛత్తీస్గఢ్లో చెట్టును ఢీకొన్న బీఎస్ఎఫ్ సిబ్బంది బస్సు
ఛత్తీస్గఢ్లో సరిహద్దు భద్రతా దళ(బీఎస్ఎఫ్) సిబ్బంది ప్రయాణిస్తున్న ఓ బస్సు నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో 17 మంది సిబ్బంది గాయపడ్డారు. -
వైవాహిక స్థితి ఏదైనప్పటికీ... వయోజనులైన ఇద్దరు ఇష్టపడితే నేరం కాదు: హైకోర్టు
వివాహితులైన భార్యాభర్తల మధ్యే శారీరక సంబంధాలు ఉండాలన్నది సమాజం నిర్ణయించుకున్న ఆదర్శ నియమమని దిల్లీ హైకోర్టు తెలిపింది. -
బెంగాల్ గవర్నర్పై లైంగిక ఆరోపణలు
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తనను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ ఓ మహిళ సంచలన ఆరోపణ చేశారు. ఈ మేరకు అక్కడి రాజ్భవన్లో తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్న మహిళ స్థానిక హరే స్ట్రీట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
దక్షిణ భారత్ దిశగా రాకాసి కెరటాలు..
లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, దక్షిణ తమిళనాడు రాష్ట్రాల వైపు రాకాసి కెరటాలు తరుముకొస్తున్నాయని.. రెండు రోజుల పాటు సముద్రం ఉగ్రరూపం దాల్చనుందని భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం (ఇన్కాయిస్) శుక్రవారం హెచ్చరిక జారీ చేసింది. -
దేశీయ బాంబర్ డ్రోన్ ఎఫ్డబ్ల్యూడీ-200బి సిద్ధం
రక్షణశాఖ అవసరాలకు అనుగుణంగా పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో బాంబర్ డ్రోన్ను తయారు చేసినట్లు ఫ్లయింగ్ వెడ్జ్ సంస్థ వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు (7)
మహాత్మాగాంధీ ‘కపటి’ అని గుజరాత్ కాంగ్రెస్ నేత, రాజ్కోట్ మాజీ ఎమ్మెల్యే ఇంద్రనీల్ రాజ్గురు వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆయన కంటే రాహుల్గాంధీ మెరుగని పేర్కొన్నారు. -
ఖైదీ కడుపులో సెల్ఫోన్
కర్ణాటకలోని శివమొగ్గ కేంద్ర కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్న పరశురామ్ అనే ఖైదీ సెల్ఫోన్ మింగేశాడు. తనకు కడుపునొప్పి వస్తోందని నెల రోజులుగా జైలు అధికారులకు చెప్పగా.. స్థానిక ప్రభుత్వ మెగ్గాన్ ఆసుపత్రికి తరలించారు. -
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
హసనకు చెందిన జేడీఎస్ మహిళ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రజ్వల్పై అత్యాచారం కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి