Amarnath Yatra: అమర్నాథ్ విషాదం.. 84 మంది ఏపీ వాసులు సురక్షితం
అమర్నాథ్కు వెళ్లిన యాత్రికుల్లో ఐదుగురు ఆంధ్రప్రదేశ్కు (Andhra Pradesh) చెందినవారి ఆచూకీ తెలియరాలేదని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
శ్రీనగర్: అమర్నాథ్లో (Amarnath Yatra) చోటుచేసుకున్న విషాదంలో ఆచూకి లభించని వారికోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 15వేల మంది యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా విరిగిపడిన కొండచరియల్లో దాదాపు 40 మంది వరకూ ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్కు (Andhra Pradesh) చెందిన 84 మంది యాత్రికులు సురక్షితంగా ఉన్నారని.. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. యాత్రికులు, వారి కుటుంబీకుల కోసం దిల్లీలోని ఏపీ భవన్లో హెల్ప్లైన్ నంబర్ను ఏర్పాటు చేయడంతోపాటు ఉన్నతాధికారులను శ్రీనగర్కు పంపించినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
అమర్నాథ్ క్షేత్రం సమీపంలో ఆకస్మికంగా సంభవించిన వరద విపత్తులో ఇప్పటివరకు 16 మంది మృతి చెందారు. వంద మందికిపైగా గాయపడగా వారికి వివిధ ప్రాంతాల్లో చికిత్సలు అందిస్తున్నారు. మరో 40మంది కోసం సైన్యం, కేంద్ర బలగాలు, పోలీసులు నిర్విరామంగా సహాయక చర్యలు చేపట్టాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురి ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన నెలకొంది. దీంతో జమ్మూ అధికారులతో సమన్వయం చేసుకునేందుకు ఏపీ భవన్ అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్ను శ్రీనగర్కు పంపించినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రం నుంచి అమర్నాథ్ వెళ్లిన యాత్రికులకు సహాయం అందించేందుకు 1902 హెల్ప్లైన్ నంబర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
ఇదిలాఉంటే, ఒక్కసారిగా కురిసిన అతిభారీ వర్షానికి శుక్రవారం అమర్నాథ్ సమీపంలోని బేస్ క్యాంపులోని గుడారాలపైకి వరద పోటెత్తిన సంగతి తెలిసిందే. కొండచరియలు విరిగిపడటంతో పాటు పెద్దఎత్తున బురద, రాళ్లు కొట్టుకు రావడంతో అక్కడ ఒక్కసారిగా బీభత్స పరిస్థితులు నెలకొన్నాయి. శిథిలాల కింద పదుల సంఖ్యలో యాత్రికులు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విస్తృతంగా గాలింపు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ బలగాలతోపాటు స్థానిక పోలీసులు.. రెస్క్యూ ఆపరేషన్ను కొనసాగిస్తూనే ఉన్నారు. శనివారం నాటికి 16 మృతదేహాలను వెలికితీశారు. కాగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఆదివారం కూడా యాత్రను నిలిపివేసిన అధికారులు.. పహల్గామ్, బల్తాల్ మార్గాల నుంచి వచ్చే కాన్వాయ్లను ఎక్కడికక్కడే ఆపివేశారు. దీంతో వేల మంది యాత్రికులు అమర్నాథ్ యాత్ర పునరుద్ధరణ కోసం వేచిచూస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.