ఆందోళన చేయడమనేది ప్రతి పౌరుడి హక్కు..
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ జామా మసీదు వద్ద ఆందోళన చేయడాన్ని తప్పుబట్టిన దిల్లీ పోలీసుల తీరుపై తీస్ హజారీ కోర్టు న్యాయమూర్తి తీవ్రంగా మండిపడ్డారు. ఆజాద్ బెయిల్
ఆజాద్ బెయిల్ పిటిషన్ సందర్భంగా దిల్లీ పోలీసుల తీరుపై జడ్జి ఫైర్
దిల్లీ: పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ జామా మసీదు వద్ద ఆందోళన చేయడాన్ని తప్పుబట్టిన దిల్లీ పోలీసుల తీరుపై తీస్ హజారీ కోర్టు న్యాయమూర్తి తీవ్రంగా మండిపడ్డారు. ఆజాద్ బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరిపిన న్యాయమూర్తి.. జామా మసీదు ఏమైనా పాక్లో ఉందా? అంటూ పోలీసులకు మొట్టికాయలు వేశారు.
జామా మసీదు వద్ద ఆందోళన చేపట్టేందుకు ఆజాద్ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని విచారణ సందర్భంగా పోలీసుల తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇందుకు న్యాయమూర్తి కామిని లౌ స్పందిస్తూ.. ‘ఏ అనుమతి తీసుకోవాలి? సెక్షన్ 144ను పదేపదే ఉపయోగించడం నేరమని సుప్రీంకోర్టు ఇదివరకే చెప్పింది. చాలా ఘటనల్లో చాలా మంది ఆందోళన చేయడం సహజమే. అంతెందుకు పార్లమెంట్ ముందు కూడా నిరసనలు చోటుచేసుకున్న సందర్భాలున్నాయి. ఇందులో సీనియర్ రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. మీరు(పోలీసులను ఉద్దేశిస్తూ) రాజ్యాంగాన్ని ఎప్పుడైనా చదివారా..? ఆందోళన చేయడం అనేది ప్రతి పౌరుడి రాజకీయ హక్కు. అలాంటప్పుడు జామా మసీదు వద్ద నిరసన చేపడితే తప్పేంటీ? జామా మసీదు పాకిస్థాన్లో ఉన్నట్లు మీరు ప్రవర్తిస్తున్నారు. ఒకవేళ పాకిస్థాన్లో ఉన్నా.. అక్కడకు వెళ్లి కూడా శాంతియుత ఆందోళన చేయొచ్చు. ఎందుకంటే పాక్ కూడా ఒకప్పుడు అవిభాజ్య భారత్లో భాగమే’ అని చెప్పుకొచ్చారు.
జామా మసీదు వద్ద ఆజాద్ ఏమైనా నేరపూరిత ప్రసంగాలు చేశారా అని కోర్టు పోలీసులను ప్రశ్నించింది. ఒకవేళ అలా చేసి ఉంటే అందుకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఆజాద్ బెయిల్పై తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గత నెల 20న ఆజాద్ నేతృత్వంలోని భీమ్ ఆర్మీ జామా మసీదు ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. మసీదు నుంచి జంతర్ మంతర్ వరకు ర్యాలీకి పిలుపునిచ్చింది. అయితే ఇందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ భీమ్ ఆర్మీ కార్యకర్తలు ర్యాలీకి బయల్దేరగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆజాద్ సహా మరికొందరిని అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434