భారత్తో భాగస్వామ్యం మరింత బలపడింది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటన అమెరికా-భారత మధ్య ఉన్న భాగస్వామ్య విలువలను ప్రదర్శించిదని అమెరికా.....
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటన అమెరికా-భారత మధ్య ఉన్న భాగస్వామ్య విలువలను ప్రదర్శించిందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో అన్నారు. తాజాగా ఆయన ట్రంప్ పర్యటనపై ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘భారత్లో ఈ వారం జరిగిన ట్రంప్ మొదటి అధికారిక పర్యటన అమెరికా-భారత్ భాగస్వామ్య విలువలను ప్రదర్శించింది’’ అని అన్నారు. ‘‘ప్రజాస్వామ్య సంప్రదాయాలు మనల్ని ఒక్కటి చేస్తాయి, ఆలోచనల భాగస్వామ్య బంధాలు మనల్ని కలుపుతాయి, అధ్యక్షుడి నాయకత్వంలో మన భాగస్వామ్యం మరింత బలపడుతుంది’’ అని ట్రంప్ భారత పర్యటనను ఉద్దేశించి వైట్ హౌస్ చేసిన ట్వీట్ని ఆయన రీట్వీట్ చేశారు. ‘‘భారత్తో మా భాగస్వామ్యాన్ని మరింత ధృడ పరుచుకొంటాం. ఒకేరకమైన ప్రజాస్వామ్య సంప్రదాయాలు, స్వేచ్ఛ, వ్యక్తిగత హక్కులు, చట్ట పాలనను పరిరక్షించే రాజ్యాంగాల ద్వారా రెండు దేశాలు ఎల్లప్పుడూ ఐక్యంగా ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకుంటామని’’ వైట్ హౌస్ ట్వటర్లో పేర్కొంది.
ట్రంప్ పర్యటన ద్వారా అమెరికా- భారత్ మధ్య భాగస్వామ్యం అద్భుతమైన పురోగతి సాధించిదని అమెరికా ప్రతినిధి అలైస్ జీ వెల్స్ అన్నారు. ఇంధనం, రక్షణ, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు, ఇండో-పసిఫిక్ సమన్వయం వంటి ముఖ్య రంగాలలో మరింత సహకారానికి ఈ పర్యటన ఎంతగానో తోడ్పడిందని వెల్స్ చెప్పారు. అమెరికా-భారత్ ఇంధన భాగస్వామ్యంలో పెట్రోలియం, సౌర, పవన శక్తిని అభివృద్ధి చేయడానికి యుఎస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ 600 మిలియన్ డాలర్ల పెట్టుబడిని అందించే విషయంలో ఎంతో పురోగతి సాధించినట్లు వెల్లడించారు. ఏప్రిల్లో తమ దేశ ప్రతినిధులు, పార్లమెంట్ సభ్యుల ‘ఎక్స్ఛేంజ్ విజిట్’ జరగనుందని తెలిపారు. మానవ అంతరిక్ష ప్రయాణానికి భారత్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మరింత మంది భారత ఉన్నత స్థాయి విద్యార్థులను అమెరికాకు ఆహ్వానించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. దిల్లీ అల్లర్లపై స్పందిస్తూ అన్ని వర్గాల వారు శాంతిని పాటించి, సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు కృషి చేయాలని వెల్స్ కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434