కరోనా ఎఫెక్ట్: దేవుళ్ల విగ్రహాలకు మాస్క్లు
యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి (కొవిడ్ 19) కలవర పెడుతోంది. ఈ వైరస్ పంజా విసిరడంతో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 4076 మంది మృత్యువాత పడగా.. 1,14,720 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.......
ఇంటర్నెట్ డెస్క్: యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి (కొవిడ్ 19) కలవర పెడుతోంది. ఈ వైరస్ పంజా విసిరడంతో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 4076 మంది మృత్యువాత పడగా.. 1,14,720 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. చైనాలో విజృంభించిన ఈ ప్రాణాంతక మహమ్మారి క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తూ ఆయా దేశాల ఆర్థిక, పర్యాటక రంగాలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. చైనాలో ఈ కేసులు నెమ్మదిస్తున్నా.. ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో పెరుగుతున్నాయి. భారత్లో ఇప్పటివరకు 56 కరోనా కేసులు నమోదయ్యాయి. భారత్లో క్రమంగా కేసులు పెరుగుతుండటంపై ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ప్రజలు చేతులు కడుక్కోవడంతో పాటు మాస్క్లు ధరిస్తూ జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తోంది. మరోవైపు, వారణాసిలోని ప్రహ్లాదేశ్వరస్వామి ఆలయంలోని పలు విగ్రహాలకు సైతం అక్కడి పూజారులు మాస్క్లు ధరించడం అక్కడి భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
చైనాలో తగ్గుముఖం.. నర్సుల గంతులు
వుహాన్: చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ వంద దేశాలకుపైగా వ్యాపించి తన వ్యాప్తిని కొనసాగిస్తోంది. ఒక్క చైనాలోనే దాదాపు 3200 మంది ప్రాణాలను బలితీసుకోగా మరో 80వేల మందికి పైగా పీడిస్తోందీ మహమ్మారి. ఈ సమయంలో కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు చైనా ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేసింది. కరోనాపై యుద్ధం ప్రకటించిన చైనా.. అక్కడ దీని తీవ్రతను తగ్గించేందుకు ప్రత్యేక ఆసుపత్రులను నిర్మించి వేల సంఖ్యలో పడకలను సిద్ధం చేసింది. అనుక్షణం ఆసుపత్రుల్లో డాక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. దీంతో వైద్యులు, సహాయకుల (నర్సుల) రాత్రి, పగలు తేడా లేకుండా ఆసుపత్రుల్లోనే ఉండి వైరస్ బారినపడ్డ వారికి చికిత్స అందించారు. గత మూడునెలలుగా విజృంభిస్తోన్న కరోనా తీవ్రత ప్రస్తుతం చైనాలో కాస్త తగ్గుముఖం పట్టింది. ఇప్పటికి దాదాపు 70శాతం మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. దీంతో కరోనాకు కేంద్రబిందువుగా భావిస్తున్న వుహాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రుల్లో కొన్నింటిని మూసివేస్తున్నారు. ఈ సమయంలో అక్కడ పని చేసిన నర్సులు ఆనందంతో గంతులేస్తున్నారు. వుహాన్లో ఉన్న ఓ ఆసుపత్రి నుంచి చివరి పేషెంట్ డిశ్చార్జి అయి ఇంటికి వేళ్లే సమయంలో అక్కడి నర్సులు ఆనందంతో గంతేశారు. ఈ విషయాన్ని అక్కడి మీడియా ట్విటర్ ద్వారా షేర్ చేసింది. దీంతో కరోనా వైరస్ ఎదుర్కోవడంలో మీ సేవలు ఎంతో అమూల్యమైనవి.. నిజమైన హీరోలు మీరేనంటూ అభినందనలు వెల్లువెత్తాయి.
ఉష్ణోగ్రతలతో కరోనాకు సంబంధం లేదు!
దిల్లీ: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా భారత్పైనా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇప్పటి వరకు సరైన మందులేని ఈ వైరస్ గురించి అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా దీనిపై దిల్లీకి చెందిన పలువురు నిపుణులు పలు సూచనలు చేశారు. ఈ వైరస్ వ్యాప్తికి, ఉప్ణోగ్రతలకు సంబంధంలేదని వారు తెలిపారు. ఈ వైరస్ ఒకరి వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని, ప్రజలు గుంపులుగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటం మేలని సూచిస్తున్నారు. అంతేకాకుండా చేతులను శుభ్రంగా కడుక్కోవడం వంటి ముందు జాగ్రత్త చర్యలతో దీని వ్యాప్తిని అరికట్టవచ్చని పేర్కొంటున్నారు.
సాధారణంగా గాలిలోని తేమ ఈ వైరస్ వ్యాప్తికి సహాయడుతుందని పరిశోధనలో తేలిందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ‘‘ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా వైరస్ చనిపోతుందనే దానికి ఎటువంటి సంబంధంలేదు. వాతావరణంలో తేమ, వేడి ఉన్న సింగపూర్ వంటి దేశాలు కూడా కరోనా ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయని’’ గులేరియా అన్నారు. వాతావరణంలోని ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులకు, కరోనా వ్యాప్తికి మధ్య సంబంధం ఉందనే విషయం ఇంకా నిరూపితం కావాలని దిల్లీ ప్రభుత్వ ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ నూతన్ ముండేజా తెలిపారు. మనుషుల ద్వారానే ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని ఆమె పేర్కొన్నారు.
‘‘కరోనా పూర్తిగా కొత్త వైరస్. దాని గురించి శాస్త్రీయ సమాజానికి పూర్తి సమాచారం లేదు. ఇతర ఫ్లూ వైరస్లు జలుబు, పొడి వాతావరణంలో పెరిగి, పునరుత్పత్తి అవుతాయి. కానీ ఇవి ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద పునరుత్పత్తి కావు. 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద ఫ్లూ వైరస్లు విస్తరించలేవు’’ అని మాక్స్ హెల్త్కేర్ సీనియర్ డైరెక్టర్ సందీప్ బుధిరాజా తెలిపారు. ‘‘కరోనా వైరస్ అధిక ఉష్ణోగ్రతల్లో పునరుత్పత్తి కాదు. కానీ చల్లని ఉష్ణోగ్రతల్లో దీని జీవిత కాలం పెరుగుతుంది. కరోనా సోకిన వ్యక్తికి దగ్గరగా ఉన్న వ్యక్తులకు ఇది వ్యాపించవచ్చు’’ అని దిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ కిషోర్ సింగ్ అన్నారు.
విమాన యానంపై కరోనా ఎఫెక్ట్
ముంబయి: కరోనావైరస్ ఎఫెక్ట్ దేశీయ విమానయాన రంగంపైనా పడింది. తాజా బుకింగ్లు ఒక్కసారిగా 15శాతం పడిపోయాయి. కొవిడ్-19 వ్యాప్తి పెరగడంతో చాలా మంది ఇప్పటికే చేసుకొన్న బుకింగ్లను రద్దు చేసుకుంటున్నారు. దీంతో విమానయాన సంస్థల ఆదాయం కూడా తగ్గుముఖం పడుతోంది. చమురు ధరలు తగ్గడం ఒక్కటే విమానయాన సంస్థలకు కొంత ఉపశమనం ఇస్తోంది.
ఇప్పటికే భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై చాలా దేశాలు తాత్కాలిక నిషేధం విధించాయి. ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో ఈ పరిస్థితి ఉండటంతో చాలా మంది ప్రయాణాలు రద్దు చేసుకొంటున్నారు. ఇక దేశీయ ప్రయాణాల్లో దిల్లీ, ముంబయి, హైదరాబాద్, బెంగళూరు మార్గాల్లో ప్రయాణాలు తగ్గాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు దేశీయ విమానయాన రంగంపై కరోనా ప్రభావం తక్కువగా ఉంది. కానీ, ఇది పెరుగుతున్న భయాలతోపాటే పెరుగుతోంది. ఇటీవల కొన్నాళ్ల కిందట కరోనా భయం ఒక్కసారిగా పెరగటంతో అప్పట్లో చెన్నై-బెంగళూరు మార్గంలో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఒక దశలో వోల్వో బస్సుతో సమానంగా రూ.1,100కు టికెట్లు విక్రయించారు.
కరోనా కోసం ‘కోవా పంజాబ్’
చండీగఢ్: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ పంజాబ్ ప్రభుత్వం ప్రజల సంరక్షణార్థం ఓ మొబైల్ యాప్ను ప్రవేశపెట్టింది. ‘కోవా పంజాబ్’గా దీనికి నామకరణం చేశారు. పంజాబ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కరణ అవతార్ సింగ్ దీన్ని ఆవిష్కరించారు. ఈ యాప్లో కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ వైరస్ లక్షణాలను వివరిస్తారు. అలాగే దగ్గర్లోని కరోనా పరీక్షలు చేసే ఆరోగ్యకేంద్రాల వివరాలు కూడా అందుబాటులో ఉంచారు.
దేవుళ్ల విగ్రహాలకు ‘కరోనా’ మాస్క్లు
వారణాసి: వారణాసిలోని ప్రహ్లాదేశ్వర స్వామి ఆలయంలో అక్కడి పూజారులు కూడా మాస్కులు ధరించే పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ పూజారి విశ్వనాథుడి విగ్రహానికి, మందిరంలోని ఇతర విగ్రహాలకు కూడా మాస్కులు ధరించడం భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా విగ్రహాలను ముట్టుకోవద్దంటూ పూజారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ‘‘కరోనా వైరస్ దేశమంతటా వ్యాప్తిస్తోంది. ఈ విషయమై ప్రజల్లో అవగాహన తీసుకురావటానికి మేం విశ్వనాథుడి విగ్రహానికి కూడా మాస్కు వేశాం. ఇక్కడి విగ్రహాలకు శీతాకాలంలో వెచ్చని దుస్తులు, వేసవిలో ఫ్యాన్లు, ఏసీలు వేస్తాం. అలాగే కరోనా దేశమంతా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇక్కడి విగ్రహాలకు కూడా మాస్కులు ధరించాం. కరోనా వైరస్ వ్యాప్తించకుండా ఉండటానికి విగ్రహాలను తాకొద్దని కూడా భక్తులకు సూచిస్తున్నాం’’ అని ఆలయ పూజారి కృష్ణ ఆనంద్ పాండే తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటా విజేతగా నిలిస్తే?.. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
భారత్లో ఎత్తయిన ప్రాంతాల్లోని చిన్నారులకు స్టంటింగ్ ముప్పు
వయసుకు తగ్గట్లు శారీరక ఎదుగుదల లోపించే (స్టంటింగ్) ముప్పు భారత్లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని, తాజా అధ్యయనం తేల్చింది. -
దక్షిణాదిలో నీటి సంక్షోభం!
దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్ పేర్కొంది. -
రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు
దేశ రాజధాని దిల్లీలోని నగరపాలక సంస్థ (ఎంసీడీ) పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంపై నగరపాలక సంస్థను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలదీసింది. -
భారతీయులకే అమెరికాలో సీఈవో అవకాశం!
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు హైకోర్టు నిరాకరణ
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ ఆరోపించిన తెలిసిందే. -
కేంద్ర చట్టంపై దిల్లీ ప్రభుత్వ సవాలు విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా
దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కట్టపెడుతూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
సిసోదియా జ్యుడిషియల్ కస్టడీ 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోదియా, సహ నిందితుడు విజయ్ నాయర్, ఇతరుల జ్యుడిషియల్ కస్టడీని శుక్రవారమిక్కడి న్యాయస్థానం మే ఎనిమిదో తేదీ వరకు పొడిగింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా చెక్ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు