సోషల్ మీడియాపై ట్రంప్ ఉక్కుపాదం..!
సామాజిక మాధ్యమ సంస్థలకు సంబంధించి చట్టపరమైన రక్షణలను తొలగించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. సామాజిక మాధ్యమ సంస్థలు ఆన్లైన్ కంటెంటును తనిఖీ చేస్తే చర్యలు తీసుకునేలా ఈ ఆర్డర్ తీసుకొచ్చారు.
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం..
వాషింగ్టన్: సామాజిక మాధ్యమ సంస్థలకు ఇప్పటివరకు ఉన్న చట్టపరమైన రక్షణలను తొలగించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. సామాజిక మాధ్యమ సంస్థలు ఆన్లైన్ కంటెంటును తనిఖీ చేస్తే చర్యలు తీసుకునేలా ఈ ఆర్డర్ తీసుకొచ్చారు. ఈ ఆర్డర్ ద్వారా సర్వీస్ ప్రొవైడర్ల నిబంధనల ప్రకారం, ఏ రకమైన కంటెంట్ నిరోధాన్ని మోసపూరితమైందిగా లేదా అస్థిరమైందిగా పరిగణిస్తారో తెలపాలని ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్(ఎఫ్సీసీ)ని కోరింది.
‘వ్యక్తుల లేదా గ్రూపుల మధ్య జరిగే చర్చలను మార్పు చేయడం, తొలగించడం, దాచి పెట్టడం, నియంత్రించడం వంటి విశేష అధికారాలు ఈ టెక్నాలజీ కంపెనీలకు ఉన్నాయి. భవిష్యత్తులో దీన్ని పునరావృతం కానివ్వం’ అని డొనాల్డ్ ట్రంప్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అంతేకాకుండా అమెరికా ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించేందుకే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అని ట్రంప్ వెల్లడించారు.
ఒకవేళ ఇది చట్టంగా మారితే మాత్రం సామాజిక మాధ్యమాలను కూడా ప్రచురణకర్తలుగానే పరిగణించే అవకాశం ఉంది. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికలపై యూజర్లు వెల్లడించే విషయాలకు సదరు కంపెనీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఆన్లైన్లో వ్యక్తులు చేసే కామెంట్లకు సదరు వెబ్సైట్ లేదా సోషల్ మీడియా సంస్థలు 1996 చట్టం ప్రకారం బాధ్యత వహించవు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇక సోషల్ మీడియా సంస్థలు ఈ స్వేచ్ఛను కోల్పోయే అవకాశం ఉంది.
ఈ మధ్యే డొనాల్డ్ ట్రంప్ ట్విటర్లో చేసిన కామెంట్పై ట్విటర్ ఫ్యాక్ట్చెక్ చేపట్టడాన్ని ట్రంప్ తీవ్రంగా పరిగణించారు. అంతేకాకుండా, సోషల్ మీడియాపై చర్యలు ఉంటాయని హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డరుకు ఉపక్రమించారు. అయితే, ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై మాత్రం విమర్శకుల నుంచి వ్యతిరేకత మొదలైంది. సెక్షన్ 230 ప్రకారం ప్రైవేటు ఇంటర్నెట్ ఆపరేటర్లను నియంత్రించే అధికారం ట్రంప్కు లేదని అంటున్నారు. ఇది సోషల్ మీడియా కంపెనీలపై కఠినమైన, రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ అభిప్రాయపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం