మహమ్మారి ముప్పు ఇప్పట్లో ముగిసిపోదు!
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ ఇప్పట్లో ముగిసిపోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ స్పష్టం చేశారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో చైనాలో బయటపడ్డ ఈ మహమ్మారి, ఆరు నెలల్లోపే ప్రపంచవ్యాప్తంగా కోటి మందికి సోకగా, 5లక్షల మందిని బలితీసుకుంది.
సమగ్ర వ్యూహంతోనే పోరాడాలని దేశాలకు పిలుపు..
దిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ ఇప్పట్లో ముగిసిపోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ స్పష్టం చేశారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో చైనాలో బయటపడ్డ ఈ మహమ్మారి, ఆరు నెలల్లోపే ప్రపంచవ్యాప్తంగా కోటి మందికి సోకగా, 5లక్షల మందిని బలితీసుకుంది. ఈ వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనా తెలియజేసి ఆరు నెలలు ముగిసిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ విలేకరులతో మాట్లాడారు.
ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపించేందుకు అనువైన వాతావరణం ఇంకా ఉందని.. మరింతమంది ప్రజలు దీని బారినపడే అవకాశాలు ఉన్నాయని టెడ్రోస్ అధనామ్ హెచ్చరించారు. 'వైరస్ విజృంభణ ముగియాలని, మనజీవితాలను కొనసాగించాలని మనమందరం కోరుకుంటున్నాం. వైరస్ విస్తృత వేగంతో వ్యాపిస్తున్నప్పటికీ కొన్ని దేశాలు వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో కాస్త పురోగతి సాధించాయి. కానీ, కఠినమైన వాస్తవం ఎంటంటే.. ఈ వైరస్ ప్రభావం ఇప్పట్లో ముగిసే జాడలు కనిపించడం లేదు' అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ స్పష్టం చేశారు.
ఈ సమయంలో కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు సురక్షిత, సమర్థవంతమైన వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎంతో కృషి జరుగుతోంది. అయినప్పటికీ, ఈ ప్రయత్నం కూడా విజయవంతం అవుతుందనే గ్యారెంటీ లేదని డబ్ల్యూహెచ్ఓ అత్యవసర విభాగాధిపతి మైక్ రేయాన్ అభిప్రాయపడ్డారు. అయితే, ఈ సమయంలో వైరస్ సోకిన వారిని వెంటనే గుర్తించి ఐసోలేట్ చేయడం, వారితో సన్నిహితంగా మెలిగిన వారికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం వంటి చర్యల ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని మైక్ రేయాన్ సూచించారు. ఈ విధానాన్ని అనుసరిస్తూ వైరస్ కట్టడికి సమగ్ర వ్యూహంతో ముందుకెళ్తున్న జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ దేశాలను మైక్ రేయాన్ ఉదహరించారు.
ఇదిలా ఉంటే, వైరస్పై పోరులో భాగంగా జరుగుతున్న పరిశోధనల్లో పురోగతిని అంచనా వేసేందుకు ఈవారం ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు.
ఇవీ చదవండి..
కొవిడ్ 19: ప్రతి 18 సెకన్లకు ఓ ప్రాణం!
భారత్లో 17వేలకు చేరువలో కరోనా మరణాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు