మిస్టరీ: 2నెలల్లో 350 ఏనుగుల మృతి!
ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తున్న సమయంలోనే వందల సంఖ్యలో ఏనుగులు మృత్యువాతపడటం కలవరపెడుతోంది. ఆఫ్రికా ఖండంలోని బోస్ట్వానాలో గడిచిన రెండు నెలల్లోనే దాదాపు 350ఏనుగులు మరణించినట్లు బయటపడింది. అయితే, అవి మానవులు వేటాడటం వల్ల ...
ఆఫ్రికా అడవుల్లో పడి ఉన్న ఏనుగుల మృతదేహాలు
ఆంత్రాక్స్ ప్రభావం ఉండొచ్చంటున్న శాస్త్రవేత్తలు!
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తున్న సమయంలోనే వందల సంఖ్యలో ఏనుగులు మృత్యువాతపడటం కలవరపెడుతోంది. ఆఫ్రికా ఖండంలోని బోస్ట్వానాలో గడిచిన రెండు నెలల్లోనే దాదాపు 350ఏనుగులు మరణించినట్లు గుర్తించారు. అయితే, అవి మానవులు వేటాడటం వల్ల చనిపోయిన ఆనవాళ్లు కనిపించలేదని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా గుర్తించారు. ఇలా వందల సంఖ్యలో ఏనుగులు ఏ కారణంగా చనిపోతున్నాయనే విషయం ప్రస్తుతం మిస్టరీగా మారింది. దీంతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం కారణాలను కనుగొనే పనిలోపడింది.
ఈ స్థాయిలో ఏనుగులు చనిపోవడానికి వేటగాళ్లే కారణమని మొదట భావించారు. ఇకవేళ వేటగాళ్లు జరిపే విషప్రయోగాలవల్ల వేరే జంతువులు కూడా మరణించాలి. కానీ, ఇక్కడ అలాంటి దాఖలాలేవి కనిపించలేదు. అంతేకాకుండా ఏనుగుల దంతాలు అలాగే ఉండడంతో వీటి మరణానికి మరేదో కారణమై ఉంటుందన్న నిర్ధారణకు వచ్చారు. గతంలో ఈ ప్రాంతంలో ఏనుగులపై ఆంత్రాక్స్, వేటగాళ్ల విషప్రయోగం ఘటనలను కొట్టిపారేయలేమని పరిశోధకులు అభిప్రాయడుతున్నారు.
తొలుత మే నెల ప్రారంభంలో బ్రిటన్కు చెందిన పరిశోధకుడు డాక్టర్ నియాల్ మెకాన్ 'ఒకవాంగో డెల్టా' ప్రాంతంలో విమానంలో ప్రయాణిస్తూ 169 ఏనుగు మృతదేహాలను గుర్తించారు. దాదాపు మూడు గంటలపాటు కొనసాగిన ఈ ప్రయాణంలో అధిక సంఖ్యలో ఏనుగులు అచేతనంగా పడి ఉండడాన్ని గుర్తించారు. వెంటనే అక్కడి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. అనంతరం నెలరోజుల పాటు చేసిన పరిశోధనలో దాదాపు 356 ఏనుగు మృతదేహాలను కనుగొన్నారు. చనిపోయిన వాటిలో భిన్న వయస్సుగల ఏనుగులు, ఆడ, మగవీ ఉన్నట్లు గుర్తించారు. వీటి మరణానికి కచ్చితమైన కారణం తెలియనప్పటికీ ఏనుగుల నాడీ వ్యవస్థపై ఏదో దాడి చేయడంవల్లే ఇవి మరణిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. విగతజీవులుగా పడి ఉన్న వాటి ముఖాలను పరిశీలిస్తే ఇదేవిషయం అర్థమవుతోందని డాక్టర్ నియాల్ మెకాన్ అభిప్రాయపడ్డారు.
వందల సంఖ్యలో ఏనుగుల మరణానికి కచ్చితమైన కారణాలను పరీక్షా నివేదికలు వచ్చాకే తెలుస్తుందని అక్కడి ప్రాంతీయ వన్యప్రాణి సంరక్షణ సమన్వయకర్త డిమాకట్సో షేబీ మీడియాకు వెల్లడించారు. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో దాదాపు 356ఏనుగులు చనిపోయినట్లు నివేదికలు వెల్లడిస్తుండగా వాటిలో ఇప్పటివరకు 275 మరణాలను ధ్రువీకరించామని జాతీయ వన్యప్రాణి, ఉద్యానవనశాఖ డైరెక్టర్ సిరిల్ టవోలో ప్రకటించారు. ఆంత్రాక్స్తో చనిపోతున్నాయని ఇంకా ధ్రువీకరించాల్సి ఉందన్నారు. చనిపోయిన ఏనుగుల నుంచి శాంపిళ్లను సేకరించి వాటిని దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెనడాల్లోని ల్యాబ్లకు పంపించామని తెలిపారు.
ఇదిలా ఉంటే, ఆఫ్రికా ఖండంలో మొత్తం ఏనుగులలో మూడింట ఒకవంతు బోస్ట్వానాలోనే ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 1990దశకంలో వీటిసంఖ్య 80వేలు ఉండగా ప్రస్తుతం లక్షా 30వేలకు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. అయితే, వేటగాళ్ల కారణంగా ఆఫ్రికాలో ఈ మధ్య ఏనుగుల సంఖ్య తగ్గుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం