రద్దీలో ఉంటే మాస్కులు ధరించండి
రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించడంతో పాటు కొవిడ్-19 సంబంధిత జాగ్రత్తల్ని పాటించాలని కేంద్రం సూచించింది. కరోనా కేసుల పరంగా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
కరోనా ఇంకా అంతరించిపోలేదు
పండుగల వేళ అప్రమత్తత అవసరం
చైనా నుంచి వచ్చేవారికి వైద్య పరీక్షలు
సమీక్ష సమావేశంలో కేంద్ర మంత్రి మాండవీయ
దిల్లీ: రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించడంతో పాటు కొవిడ్-19 సంబంధిత జాగ్రత్తల్ని పాటించాలని కేంద్రం సూచించింది. కరోనా కేసుల పరంగా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అనవసర భయాందోళన వద్దనీ, అప్రమత్తత మాత్రం అవసరమని హెచ్చరించింది. చైనా సహా కొన్ని దేశాల్లో కరోనా కేసులు ఆకస్మికంగా పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో పరిస్థితిపై ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ‘‘కొవిడ్-19 ఇంకా అంతరించిపోలేదు. అందువల్ల అప్రమత్తంగా ఉంటూ కేసులపై కన్నువేసి ఉంచాలని సంబంధిత అధికారులందరినీ ఆదేశించాం. కొన్ని దేశాల్లో కేసులు మరోసారి పెరుగుతుండడం, కొత్త వేరియంట్లు వస్తుండడం, పండుగలు సమీపిస్తుండడం ఓ సవాల్లాంటిది. దేశంలో కరోనా వైరస్లో కొత్త రకాలేమైనా ఉన్నాయేమో సకాలంలో గుర్తించడానికి వీలుగా పాజిటివ్ నమూనాల జన్యుక్రమాన్ని విశ్లేషించేలా పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం’’ అని మాండవీయ చెప్పారు. దేశ, విదేశాల్లో తాజా పరిస్థితిని, వివిధ విభాగాల సన్నద్ధతను ఉన్నతాధికారులు తొలుత ఆయనకు నివేదించారు. దేశంలో రోజువారీ సగటు కేసులు 158 ఉంటే, ప్రపంచంలో మాత్రం 5.9 లక్షల చొప్పున ఉందని తెలిపారు. చైనాలో కేసుల జోరుకు కారణం ఒమిక్రాన్ వేరియంట్లోని బీఎఫ్.7 రకమేనని, ఇది అత్యంత వేగంగా విస్తరిస్తోందని చెప్పారు. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడుల్లో మాత్రం కొత్త కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయని తెలిపారు. ఈ నెల 20న వచ్చిన కొత్త కేసుల్లో ఈ ఐదు రాష్ట్రాల నుంచే 84% ఉన్నాయని చెప్పారు.
ముందస్తు డోసు.. 28% లోపే
దేశంలో అర్హులైన జనాభాలో కేవలం 27-28% మంది ముందస్తు (ప్రికాషన్) టీకా తీసుకున్నారని, వీటిని మిగిలినవారు కూడా తీసుకుని మాస్కులు ధరించాలని నీతి ఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్ వి.కె.పాల్ సూచించారు. ‘ప్రజలు భయపడాల్సిన పనిలేదు. అంతర్జాతీయ విమాన ప్రయాణాల మార్గదర్శకాల్లో ఎలాంటి మార్పు ఇంతవరకు చేయలేదు. రద్దీ ప్రదేశాల్లో మాస్కుల వాడకాన్ని కొనసాగించాలి’ అని పాల్ ఈ సమావేశానంతరం చెప్పారు.
విమానాశ్రయాల్లో మళ్లీ పరీక్షలు
చైనా సహా ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చేవారిలో కొందరిని యాదృచ్ఛికంగా ఎంపిక చేసి, వారికి కరోనా ఉందో లేదో తెలుసుకునేందుకు నమూనాలను పరీక్షించనున్నారు. పరిస్థితిపై కేంద్రం వచ్చేవారంలో మరోసారి సమీక్షించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘400 మంది మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యం’ - రాహుల్ సంచలన ఆరోపణ
హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) దాదాపు 400 మంది మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని రాహుల్ గాంధీ ఆరోపించారు. -
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
Prajwal Revanna: లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు బృందం లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. -
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
Delhi Commission for Women: దిల్లీ మహిళా కమిషన్లో 223 మంది ఉద్యోగులపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వేటు వేశారు. వారిని తక్షణమే విధుల్లో నుంచి తొలగించారు. -
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
మండుటెండల్లో వాహనదారులకు కాస్త ఉపశమనం కల్పించింది పుదుచ్చేరి ప్రభుత్వం. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ షేడ్ నెట్స్ను ఏర్పాటు చేసింది. -
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
వడగళ్లతో దెబ్బతిన్న రెక్కలు..విమానానికి తప్పిన ప్రమాదం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 170 మందితో బుధవారం మధ్నాహ్నం 1.45 గంటలకు దిల్లీకు ప్రయాణమైన విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్