అదానీపై అదే రగడ..
అదానీ గ్రూప్ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మోదీ అండతోనే ఆయన ఎదిగారు
గౌతమ్ కోసం నిబంధనలే మార్చేశారు
విమానాశ్రయాలు, పోర్టులు కట్టబెట్టేశారు
లోక్సభలో నిప్పులు చెరిగిన రాహుల్
ప్రధానితో అదానీ కలసి ఉన్న ఫొటో ప్రదర్శన
అభ్యంతరం వ్యక్తం చేసిన స్పీకర్
దిల్లీ: అదానీ గ్రూప్ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే గౌతమ్ అదానీ అనతికాలంలో ప్రపంచ కుబేరుడిగా అవతరించారంటూ విమర్శించారు. అదానీ కోసం ఏకంగా నిబంధనలనే మార్చేశారని దుయ్యబట్టారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో రాహుల్ గాంధీ మంగళవారం సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా గౌతమ్ అదానీ వ్యవహారంపై పలు ఆరోపణలు చేశారు.
రాహుల్ ఆరోపణలు, సంధించిన ప్రశ్నలు
* విమానాశ్రయాల నిర్వహణలో పూర్వ అనుభవం లేనివారికి వాటి నిర్వహణ బాధ్యతలను అప్పగించకూడదని నిబంధనలు ఉన్నాయి. కానీ, వాటిని కేంద్ర ప్రభుత్వం మార్చివేసింది. ఏకంగా దేశంలోని ఆరు ఎయిర్పోర్టుల(30 శాతం వ్యాపార వాటా)ను అదానీకి కట్టబెట్టింది. అత్యంత లాభదాయకమైన విమానాశ్రయాల్లో ఒకటైన ముంబయి ఎయిర్పోర్టును అప్పగించింది. ఇందుకోసం జీవీకే గ్రూప్పై సీబీఐ, ఈడీలను ప్రయోగించింది.
* 2014లో 8 బిలియన్ డాలర్లుగా ఉన్న అదానీ సంపద 2022 నాటికి 140 బిలియన్ డాలర్లకు ఎలా పెరిగింది? నరేంద్ర మోదీ 2014లో ప్రధానమంత్రి అయ్యాక ఇంద్రజాలం మొదలైంది. ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన వ్యక్తుల్లో 2014లో 609వ స్థానంలో ఉన్న అదానీ ఇటీవల రెండో స్థానానికి ఎగబాకారు.
* ప్రధాని మోదీ ఆస్ట్రేలియాకు వెళ్తే అదానీ గ్రూప్నకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చింది.
* ప్రధాని బంగ్లాదేశ్ వెళితే అక్కడి పవర్ డెవలప్మెంట్ బోర్డు అదానీకి 25 ఏళ్ల కాంట్రాక్టు అప్పగించింది. ఇదేం మాయ?
* భారత్-ఇజ్రాయెల్ రక్షణ సహకారం ఒప్పదం 90 శాతం అదానీ చెప్పుచేతల్లో ఉంది.
* ప్రధాని మోదీ ఒత్తిడితోనే తమ దేశంలో నిర్మితమవుతున్న పవర్ ప్రాజెక్ట్ను అదానీకి అప్పగించామని శ్రీలంక వెల్లడించింది.
* ఇటీవల విడుదలైన హిండెన్బర్గ్ నివేదికలో అదానీకి భారత్ వెలుపల షెల్ కంపెనీలు ఉన్నాయని ఉంది. అవి వేలాది కోట్ల రూపాయలను భారత్లోకి పంపుతున్నాయి. ఇవి ఎవరి డబ్బులు?
* భారత్లోని పోర్టుల్లో, విమానాశ్రయాల్లో అదానీ ఆధిపత్యం చెలాయిస్తారు. భారత రక్షణ రంగంలోనూ అదానీ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి వ్యక్తికి షెల్ కంపెనీలు ఉంటే కేంద్ర ప్రభుత్వం కనీసం ప్రశ్నించడం లేదు. వాటి గురించి మీకు ఏమీ తెలియదు.
* ప్రధాని మోదీ ఇప్పటి వరకు అదానీతో కలిసి ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లారు? విదేశాల్ల్లో ఎన్నిసార్లు అదానీని కలిశారు? భాజపాకు గడిచిన 20 ఏళ్లలో అదానీ ఎంతిచ్చారు?
నిరుద్యోగం ప్రస్తావనేది?
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే భారత్ జోడో యాత్ర చేశానని రాహుల్ చెప్పారు. పాదయాత్రలో ఎంతోమంది ప్రజలు తమ బాధలు చెప్పుకున్నారని తెలిపారు. ప్రస్తుతం నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సమస్యలే ప్రధానంగా ఉన్నాయని.. కానీ రాష్ట్రపతి ప్రసంగంలో నిరుద్యోగం గురించి మాట్లాడలేదని విమర్శించారు. అగ్నిపథ్ స్కీమ్నూ ఈ సందర్భంగా రాహుల్ తప్పుబట్టారు. ఆర్మీని ఈ పథకం బలహీన పరుస్తుందని సీనియర్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు.
అధికార పక్షం అభ్యంతరాలు
లోక్సభలో రాహుల్ ప్రసంగం సమయంలో అధికార పక్షం నుంచి పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నిరాధారమైన ఆరోపణలు చేయొద్దంటూ కేంద్రమంత్రి కిరణ్ రిజిజు రాహుల్కు సూచించారు. ఆధారాలు ఉంటే చూపించాలన్నారు. తన ప్రసంగం మధ్యలో అదానీతో మోదీ సంబంధాలకు సంబంధించి వారు ఇద్దరూ కలిసి ఉన్న చిత్రాలను లోక్సభలో రాహుల్ గాంధీ ప్రదర్శించారు. దీనిపై స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై మాత్రమే మాట్లాడాలన్నారు. మరోపక్క విపక్షానికి చెందిన పలువురు నేతలు రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శిస్తూ అదంతా అర్ధసత్యాలతోనే ఉందని ఆక్షేపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి ముఖ్యమైన అంశాలను ప్రస్తావించలేదని ఆరోపించారు.
* రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రను ఉద్దేశించి దేశాన్ని ఏకం చేయడానికంటే ముందు రాజస్థాన్లో కాంగ్రెస్ ముఠాలను ఐక్యంగా ఉంచడంపై దృష్టిసారించాలని భాజపా ఎంపీ సి.పి.జోషి విమర్శించారు.
సభా కార్యక్రమాలకు సరేనన్న ప్రతిపక్షాలు
పార్లమెంటు సభా కార్యక్రమాల్లో బుధవారం నుంచి పాల్గొనాలని అధికశాతం ప్రతిపక్షాలు మంగళవారం నిర్ణయించాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ వెల్లడించారు. ఈ మేరకు రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో 15 ప్రతిపక్ష పార్టీల సమావేశంలో నిర్ణయించారన్నారు. అయితే అదానీ సమస్యపై చర్చ చేపట్టకపోతే తాము పాల్గొనేది లేదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), భారత్ రాష్ట్ర సమితి (భారాస) స్పష్టం చేశాయన్నారు.
* అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) దర్యాప్తునకు కేంద్రం అంగీకారం తెలపనందున రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చను తాము బహిష్కరిస్తున్నట్లు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ప్రకటించింది.
* అదానీ సంస్థపై హిండెన్బర్గ్ పరిశోధన నివేదిక చేసిన ఆరోపణలపై జేపీసీ దర్యాప్తు చేపట్టాలని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. అమృత్కాల్ ప్రయోజనాలు కొందరికి మాత్రమే దక్కాయన్నారు. 21 మంది వద్ద ఉన్న ఆస్తుల విలువ 70 కోట్ల మంది ప్రజల ఆస్తితో సమానంగా ఉందన్నారు.
* ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం మహిళా అభివృద్ధికి కృషి చేస్తోందని రాజ్యసభలో భాజపా సభ్యులు పేర్కొన్నారు.
* ప్రతిపక్ష సభ్యుల నిరసనలతో రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడింది.
* నరేంద్రమోదీపై రాహుల్ గాంధీ లోక్సభలో చేసిన ఆరోపణలను భాజపా సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ తోసిపుచ్చారు. అవన్నీ నిరాధారమైనవని, అభ్యంతరకరమైనవని, నిర్లక్ష్యంగా చేసినవని పేర్కొన్నారు. దేశ ప్రతిష్ఠను మసకబార్చిన భారీ కుంభకోణాల్లో కాంగ్రెస్, గాంధీ కుటుంబాలకు పాత్ర ఉందని పార్లమెంటు వెలుపల విలేకరుల వద్ద ఆక్షేపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటా విజేతగా నిలిస్తే?.. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
భారత్లో ఎత్తయిన ప్రాంతాల్లోని చిన్నారులకు స్టంటింగ్ ముప్పు
వయసుకు తగ్గట్లు శారీరక ఎదుగుదల లోపించే (స్టంటింగ్) ముప్పు భారత్లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని, తాజా అధ్యయనం తేల్చింది. -
దక్షిణాదిలో నీటి సంక్షోభం!
దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్ పేర్కొంది. -
రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు
దేశ రాజధాని దిల్లీలోని నగరపాలక సంస్థ (ఎంసీడీ) పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంపై నగరపాలక సంస్థను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలదీసింది. -
భారతీయులకే అమెరికాలో సీఈవో అవకాశం!
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు హైకోర్టు నిరాకరణ
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ ఆరోపించిన తెలిసిందే. -
కేంద్ర చట్టంపై దిల్లీ ప్రభుత్వ సవాలు విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా
దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కట్టపెడుతూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
సిసోదియా జ్యుడిషియల్ కస్టడీ 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోదియా, సహ నిందితుడు విజయ్ నాయర్, ఇతరుల జ్యుడిషియల్ కస్టడీని శుక్రవారమిక్కడి న్యాయస్థానం మే ఎనిమిదో తేదీ వరకు పొడిగింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా చెక్ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు