దొరకని అమృత్పాల్ సింగ్.. ముమ్మరంగా అన్వేషణ
చిక్కినట్లే చిక్కి చేజారిపోయిన వివాదాస్పద మతబోధకుడు, ఖలిస్థానీ సానుభూతిపరుడైన అమృత్పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట ముమ్మరంగా కొనసాగుతోంది.
కారులో లభ్యమైన తూటాలు..
మొబైళ్లలో ఇంటర్నెట్పై నిషేధం పొడిగింపు
చండీగఢ్: చిక్కినట్లే చిక్కి చేజారిపోయిన వివాదాస్పద మతబోధకుడు, ఖలిస్థానీ సానుభూతిపరుడైన అమృత్పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట ముమ్మరంగా కొనసాగుతోంది. రహదారులపై భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వదంతుల వ్యాప్తిని నిరోధించడానికిగానూ మొబైళ్లలో ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవల నిలుపుదలను సోమవారం మధ్యాహ్నం వరకు పొడిగిస్తూ పంజాబ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రులు, బ్యాంకుల సేవల్ని దృష్టిలో పెట్టుకుని బ్రాడ్బ్యాండ్పై మాత్రం నిషేధం విధించలేదు. తమ నాయకుడిపై పోలీసుల చర్యలకు నిరసనగా ఆదివారం ధర్నాకు పిలుపునిచ్చిన 34 మంది సానుభూతిపరులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఎటువంటి సమస్యలూ తలెత్తకుండా ప్రధాన నగరాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. అమృత్పాల్ కాన్వాయ్కి చెందినదిగా భావిస్తున్న ఓ కారును జలంధర్ జిల్లాలో పోలీసులు గుర్తించారు. దాని తాళాలు, ఒక వాకీటాకీ, తుపాకీ, డజన్ల కొద్దీ తూటాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తమ నాయకుడే కొనుగోలు చేశాడని పోలీసులకు పట్టుబడిన ‘వారిస్ పంజాబ్ దే’ అనుచరుడొకరు వెల్లడించాడు. దీంతో అక్రమ ఆయుధాల కోణంలో అమృత్పాల్, అతని అనుచరులు కొందరిపై పోలీసులు కొత్తగా రెండు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేసినట్లు అమృత్సర్ సీనియర్ ఎస్పీ వెల్లడించారు. వీరి నుంచి 12 తుపాకులు, 193 తూటాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.
2,500 కి.మీ. దూరానికి తరలింపు
అరెస్టయిన అనుచరుల్లో కీలకమైన నలుగురు వ్యక్తులను ప్రత్యేక విమానంలో అస్సాంలోని డిబ్రూగఢ్ కేంద్ర కారాగారానికి అధికారులు ఆదివారం తరలించారు. 2,500 కి.మీ. దూరానికి తరలించడానికి కారణమేమిటనేది చెప్పేందుకు ఏ అధికారీ సుముఖత వ్యక్తపరచలేదు. నలుగురికీ జైల్లో పూర్తి రక్షణ కల్పిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ దిల్లీలో విలేకరులకు తెలిపారు. తాము దాదాపు 25 కి.మీ. దూరం వరకు వెంటాడినా ప్రధాన నిందితుడు వాహనాలు మారుతూ తప్పించుకున్నాడని, త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. శీఘ్ర స్పందన బలగాలతో కలిసి జలంధర్ పోలీసు కమిషనర్ ఆ నగరంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. గాలింపు చర్యల్లో భాగంగా అమృత్పాల్ స్వగ్రామం జల్లుపుర్లోని నివాసంలోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. పంజాబ్ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమానాస్పదంగా కనిపిస్తున్న ప్రతి వాహనాన్నీ తనిఖీ చేస్తున్నారు.
హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు
అమృత్పాల్సింగ్ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారనీ, విడుదలకు ఆదేశించాలని కోరుతూ పంజాబ్-హరియాణా హైకోర్టులో ఆదివారం అత్యవసరంగా హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. దీనిపై మంగళవారంలోగా స్పందించాల్సిందిగా పంజాబ్ ప్రభుత్వానికి జస్టిస్ ఎన్.ఎస్.షెకావత్ ఆదేశాలు జారీచేశారు. ఆదివారం సెలవుదినం కావడంతో తన నివాసంలోనే విచారణ జరిపారు.
వ్యసన విముక్తి పేరుతో మానవ బాంబుల తయారీ..!
ఖలిస్థాన్ అనుకూల బోధకుడు అమృత్పాల్సింగ్ కార్యకలాపాలపై నిఘా వర్గాల సమాచారం ఆధారంగా అధికారులు ఒక నివేదిక రూపొందించారు. మాదకద్రవ్య వ్యసన విముక్తి కేంద్రాలను, ఒక గురుద్వారాను అడ్డం పెట్టుకుని ఆయుధాలను నిల్వ చేయడంతోపాటు ఆత్మాహుతి దాడులకు యువతను సిద్ధం చేస్తున్నాడని దీనిలో పేర్కొన్నారు. దుబాయ్ నుంచి తిరిగివచ్చిన ఈ వ్యక్తి అనేకమంది యువకుల మనసుల్ని మార్చి, వారిని మానవ బాంబులుగా మారుస్తున్నట్లు తెలిపారు. ఉగ్రవాదులు హతమైనప్పుడు వారిని పోరాటయోధులుగా కీర్తిస్తుండేవాడని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం