విద్వేష ప్రసంగాలు విషవలయాలు
మతాన్ని రాజకీయాలతో మిళితం చేయడంతోనే ప్రధాన సమస్య ఎదురవుతోంది. ఆ రెండింటినీ వేరు చేస్తే సమస్య కనుమరుగవుతుంది.
రాజకీయాలకు మతాన్ని వాడుకోవడం మానేస్తే వాటికి అడ్డుకట్టపడుతుంది
సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
మతాన్ని రాజకీయాలతో మిళితం చేయడంతోనే ప్రధాన సమస్య ఎదురవుతోంది. ఆ రెండింటినీ వేరు చేస్తే సమస్య కనుమరుగవుతుంది. రాజకీయ నాయకులు మతాన్ని ఉపయోగించుకోవడం విరమించాలి. రాజకీయాలను మతంతో ముడిపెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.
సుప్రీం ధర్మాసనం
దిల్లీ: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశాభివృద్ధికి, ప్రజాస్వామ్యానికి ఇవి ప్రమాదకరమని హెచ్చరించింది. రాజకీయాల నుంచి మతాన్ని వేరు చేయాలని స్పష్టం చేసింది. అలాగైతేనే రెచ్చగొట్టే ఉపన్యాసాలకు తెర పడుతుందని జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. విద్వేష ప్రసంగాలపై కోర్టు ధిక్కరణ చర్యలు కోరుతూ దాఖలైన పిటిషన్పై బుధవారం విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. మాజీ ప్రధాన మంత్రులు జవహర్ లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్పేయీ ప్రసంగాలను ఉదహరించిన ధర్మాసనం.. వారి మాటలు వినేందుకు మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచీ ప్రజలు వచ్చేవారని గుర్తు చేసింది. అన్ని వర్గాల ప్రజలు విద్వేష ప్రసంగాలు చేయకుండా ప్రతిజ్ఞ ఎందుకు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించింది. రోజూ ఎవరో ఒకరు ఇతరులను అవమానించేలా విద్వేష వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నా రాష్ట్రాలు వారిపై కేసులు నమోదు చేయడంలో విఫలం అవుతున్నాయని అసహనం వ్యక్తం చేసింది. నాయకులు రాజకీయాలతో మతాన్ని మిళితం చేయడంతోనే అసలు సమస్య వస్తోందని పేర్కొంది. మతాన్ని అడ్డుపెట్టుకొని చేసే రాజకీయాలు దేశ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది. ప్రస్తుత కేసులో కక్షిదారుగా చేరుతామంటూ హిందూ సమాజ్ సంస్థ చేసుకున్న అభ్యర్థనను ధర్మాసనం అనుమతించింది. ఈ సంస్థ మహారాష్ట్రలో నిర్వహించిన కార్యక్రమాలు, వాటిలో చేసిన వివాదాస్పద ప్రకటనలు విచారణ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. చట్టాలను ఉల్లంఘిస్తూపోతే అందరితో పాటు మీకూ తీవ్ర నష్టం కలిగిస్తాయని సంస్థ తరఫు వ్యక్తులను హెచ్చరించింది. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, అగ్రరాజ్యంగా అవతరించాలంటే చట్టబద్ధమైన పాలన కొనసాగాలని, నివాస యోగ్యమైన దేశంగా ఉండాలని ధర్మాసనం పేర్కొంది. విద్వేష ప్రసంగాలపై చర్యలు తీసుకోవాలని నిరంతరంగా కేసులు నమోదవుతూ ఉంటే న్యాయస్థానాలు ఎన్నిటిని విచారించగలవని ప్రశ్నించింది. ఈ తరహా నేరాలు ఆగిపోవాలంటే ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలని, ఇందుకు పకడ్బందీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటించాలని తెలిపింది.
సొలిసిటర్ జనరల్ అభ్యంతరాలు
విద్వేష ప్రసంగాలపై పిటిషన్ దాఖలు చేసిన షహీన్ అబ్దుల్లా ఎంపిక చేసిన కొన్ని ఉపన్యాసాలను మాత్రమే ధర్మాసనం ముందుకు తీసుకువచ్చారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆరోపించారు. కేరళలోని ఒక ఘటనను, తమిళనాడులో డీఎంకే నాయకుడు చేసిన ప్రకటనను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వాటిని పిటిషనర్ ఎందుకు జతచేయలేదని నిలదీశారు. ఆ రెండు రాష్ట్రాలకు ధర్మాసనం నోటీసులెందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంలో ధర్మాసనం...మెహతా మధ్య వాడివేడి సంభాషణ జరిగింది. చర్యకు ప్రతిచర్య ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. విద్వేష ప్రసంగాలు విషవలయాల వంటివని తెలిపింది. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని అనుసరించాల్సి ఉంటుందని చెబుతూ... విద్వేష ప్రసంగాలపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోకుండా మౌనం వహించడం వల్లే కోర్టు ధిక్కరణ కేసును విచారణకు చేపట్టాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. తుషార్ మెహతా స్పందిస్తూ పీఎఫ్ఐపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయంలో కేరళ ప్రభుత్వానికి నోటీసు జారీ చేయాలని కోరారు. కొన్ని ప్రసంగాల వీడియో క్లిప్పులను ప్రదర్శించేందుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేయగా ధర్మాసనం తిరస్కరించింది. ‘విచారణను ఒక డ్రామాగా మార్చొద్దు. వీడియో క్లిప్పులను చూడడానికి ఒక పద్దతి ఉంటుంది. అది అందరికీ సమానంగా వర్తిస్తుంది. కావాలంటే ఆ వీడియోలను మీ పత్రాలతో జతచేసి సమర్పించవచ్చు’అని బదులిచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 28వ తేదీకి వాయిదా వేసింది. మహారాష్ట్ర ప్రభుత్వ స్పందనను తెలియజేయాల్సిందిగా ఆదేశించింది.
విద్వేష ప్రసంగాలపై కోర్టు ధిక్కరణ చర్యలు కోరుతూ దాఖలైన పిటిషన్పై మంగళవారం విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో మత సామరస్యాన్ని కాపాడుకునేందుకు విద్వేషపూరిత ప్రసంగాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434