ఎవరు?.. ఏమన్నారు..?
సాక్షి మాలిక్, వినేశ్ ఫొగాట్, ఇతర రెజ్లర్లతో దిల్లీ పోలీసుల అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నా.
ఛాంపియన్లతో అలాగా వ్యవహరించేది?
సాక్షి మాలిక్, వినేశ్ ఫొగాట్, ఇతర రెజ్లర్లతో దిల్లీ పోలీసుల అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నా. మన దేశ ఛాంపియన్లతో అలా వ్యవహరించడం సిగ్గుచేటు. ప్రజాస్వామ్యమనేది సహనంలో ఉంటుంది. నిరంకుశ శక్తులు అసహనంతో రగులుతుంటాయి. అసమ్మతి గళాన్ని అణచివేస్తాయి. రెజ్లర్లకు నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా.
మమతా బెనర్జీ
ఇదీ నయా భారత్!
కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి లేరు. ప్రతిపక్షాలూ లేవు. సాధువులు, మఠాధిపతులే ఉన్నారు. తాను ఎలాంటి నయా భారత్ను కోరుకుంటున్నారో మోదీ దీనిద్వారా చాటిచెప్పినట్లయింది. ప్రభుత్వంలో మతం చొరబడటాన్ని రాజ్యాంగం అనుమతించదు. కానీ ప్రస్తుత పరిస్థితులు వేరేలా ఉన్నాయి!
ప్రశాంత్ భూషణ్
ప్రజాస్వామ్య దేవాలయం శక్తి మరింత పెరుగుతుంది
అశోకుడి ధర్మచక్రం, చోళుల సెంగోల్ వంటి చిహ్నాలు ఉండటం వల్ల ప్రజాస్వామ్య దేవాలయం (కొత్త పార్లమెంటు భవనం) శక్తి మరింత పెరుగుతుంది. వేర్వేరు రాష్ట్రాల నుంచి సేకరించిన మెటీరియల్ను నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి వినియోగించారు. ‘ఏక్ భారత్ - శ్రేష్ఠ్ భారత్’కు అది నిజమైన ప్రతీక.
తేజస్వీ సూర్య
అవగాహన కల్పిద్దాం
రుతుస్రావ సంబంధిత ఆరోగ్యంపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో పాటు కొన్ని అపోహల వల్ల మహిళల సంక్షేమంపై, వారి విద్యావకాశాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ విషయంలో అవగాహన పెంచేందుకు మనమంతా ప్రతినబూనుదాం. మౌలిక వసతులను మెరుగుపర్చేందుకు నిధుల కేటాయింపు పెరిగేలా చూద్దాం.
కాంగ్రెస్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.