‘బ్రహ్మచారి’ భక్తుడికి అయోధ్య ట్రస్టు ఆహ్వానం

మధ్యప్రదేశ్‌ బైతూల్‌కు చెందిన రవీంద్ర గుప్తా అలియాస్‌ భోజ్‌పలి బాబాను అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు ఆలయ ట్రస్ట్‌ ఆహ్వానించింది. 56 ఏళ్ల రవీంద్ర గుప్తా రాముడికి పరమ భక్తుడు.

Updated : 23 Dec 2023 19:02 IST

మధ్యప్రదేశ్‌ బైతూల్‌కు చెందిన రవీంద్ర గుప్తా అలియాస్‌ భోజ్‌పలి బాబాను అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు ఆలయ ట్రస్ట్‌ ఆహ్వానించింది. 56 ఏళ్ల రవీంద్ర గుప్తా రాముడికి పరమ భక్తుడు. అయోధ్యలో రామాలయం నిర్మించేవరకు వివాహం చేసుకోనని 1992 డిసెంబరు 6న శపథం చేసి, అలా ఒంటరిగానే ఉండిపోయి బాబాగా మారిపోయారు. అయోధ్య రామాలయం కర సేవకుల్లో రవీంద్ర ఒకరు. విశ్వహిందూ పరిషత్‌లో సభ్యుడిగానూ ఉన్నారు. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ పూర్తయినా తాను పెళ్లి చేసుకోనని రవీంద్ర స్పష్టం చేశారు. రాముడికే అంకితమై జీవితాన్ని కొనసాగిస్తానని తెలిపారు.

ఈటీవీ భారత్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని