
విశ్వశాంతిని నెలకొల్పే దేశంగా నవ భారతాన్ని నిర్మిద్దాం
యువతకు ప్రధాని పిలుపు
వడోదర: ప్రపంచ వ్యాప్తంగా సంఘర్షణలు, అశాంతి నెలకొన్న వేళ... విశ్వశాంతిని నెలకొల్పే దేశంగా భారత్ను తీర్చిదిద్దడంలో యువత భాగస్వామ్యం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పురాతన సంస్కృతిని, ఆధునిక ఆలోచనలను జోడించి నవభారత నిర్మాణానికి కృషి చేద్దామన్నారు. వడోదరలోని కుందాల్ధామ్, కరేలిబాగ్లలో ఉన్న శ్రీస్వామినారాయణ్ ఆలయాల ఆధ్వర్యాన గురువారం యువ సమ్మేళనం జరిగింది. దీన్ని ఉద్దేశించి మోదీ వీడియో ద్వారా ప్రసంగించారు. ‘‘సంఘర్షణలు, అశాంతి నెలకొన్న ప్రపంచానికి భారత్ ఒక ఆశాకిరణంలా మారింది. ముఖ్యంగా వాతావరణ మార్పుల సమస్యకు భారత్ తన పురాతన సుస్థిర జీవన సంప్రదాయాల నుంచి మేలైన పరిష్కారాలు చూపుతోంది. యావత్ మానవాళికీ మనం యోగా మార్గాన్ని చూపుతున్నాం. ఆయుర్వేద శక్తిని వారికి పరిచయం చేస్తున్నాం.
సమష్టి సంకల్పంతో మున్ముందుకు...
సమష్టి సంకల్పం, కృషితో నవభారత నిర్మాణానికి ముందుకు రావాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. పురాతన సంప్రదాయాలు, కొత్త ఆలోచనలతో దేశానికి కొత్త గుర్తింపు తీసుకొచ్చేలా, యావత్ మానవాళికి దిశానిర్దేశం చేసేలా ఈ నిర్మాణం సాగాలి’’ అని మోదీ పేర్కొన్నారు.
‘‘నగదు చెల్లింపులకు బదులు డిజిటల్ చెల్లింపులు చేపట్టగలరా?’’ అని సమావేశానికి హాజరైన యువతను మోదీ అడిగారు. మీ చిన్న సహకారం చిరు వ్యాపారుల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొస్తుందని చెప్పారు. పరిశుభ్రత పాటిస్తామని, ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ను వినియోగించబోమని, పౌష్టికాహార లోపాన్ని అధిగమిస్తామని ప్రతినబూనాలని సూచించారు. నాగాలాండ్కు చెందిన ఓ బాలిక కాశీలోని ఘాట్లను శుభ్రపరుస్తూ ఒంటరిగానే ప్రచారం చేపట్టిందని, ఆ తర్వాత అనేకమంది ఆ కార్యక్రమంలో భాగస్వాములయ్యారని ఈ సందర్భంగా మోదీ ఉదహరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
GST: క్యాసినో, ఆన్లైన్ గేమింగ్, గుర్రపు పందేలపై 28శాతం జీఎస్టీ!
-
India News
Maharashtra Crisis: ఏక్నాథ్ గూటికి మరో మంత్రి.. అస్సాం క్యాంపులో 9కి చేరిన మంత్రులు
-
General News
TS Corona: తెలంగాణలో కొత్తగా 434 కరోనా కేసులు
-
India News
Bypolls: యూపీలో భాజపాకు బిగ్ బూస్ట్.. పంజాబ్లో ఆప్కు భంగపాటు
-
General News
Telangana News: 28న తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్ఖాన్ని వదులుకున్నా!
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్స్టేషన్లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- Atmakur ByElection: ఆత్మకూరు ఉపఎన్నిక.. వైకాపా ఏకపక్ష విజయం
- R Madhavan: మాధవన్పై నెటిజన్ల విమర్శలు.. సైన్స్ తెలియకపోతే సైలెంట్గా ఉండు..!
- AP Liquor: మద్యంలో విషం
- Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా
- ప్రశ్నించానని పాలు, నీళ్లు లేకుండా చేశారు