Monkeypox: మంకీపాక్స్కు ఆర్టీపీసీఆర్ కిట్.. 50 నిమిషాల్లో రిజల్ట్
ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్ వైరస్.. భారత్లోనూ అడుగుపెట్టింది.
ప్రకటించిన జీన్స్టుమి సంస్థ
దిల్లీ: ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్ వైరస్.. భారత్లోనూ అడుగుపెట్టింది. ఇప్పటికే నాలుగుకేసులు వెలుగుచూశాయి. ఈ క్రమంలో నిమిషాల వ్యవధిలో ఈ వైరస్ను గుర్తించేందుకు ఆర్టీపీసీఆర్ కిట్ను అభివృద్ధి చేసినట్లు జీన్స్టుమి(Genes2Me) సంస్థ మంగళవారం ప్రకటించింది. తమ కిట్ అత్యంత కచ్చితత్వంతో 50 నిమిషాల లోపే వైరస్ నిర్ధారణ చేస్తుందని తెలిపింది. ఇది ఆర్టీపీసీఆర్ రూపంలో, పాయింట్ ఆఫ్ కేర్ రూపంలో లభిస్తుందని సంస్థ తెలిపింది. ఈ పాయింట్ ఆఫ్ కేర్ విధానాన్ని ఆసుపత్రులు, విమానాశ్రయాలు, ల్యాబ్స్లో ఉపయోగిస్తారని పేర్కొంది. ఇది సింగిల్ ట్యూబ్ మల్టిప్లెక్స్ రియాక్షన్ ఫార్మాట్లో మంకీపాక్స్, చికెన్ పాక్స్ వైరస్ల మధ్య తేడాను గుర్తిస్తుందని చెప్పింది.
ఇదిలా ఉండగా.. పశ్చిమ ఆఫ్రికాలో మొదలై ఒక్కో దేశానికి వ్యాపిస్తున్న మంకీపాక్స్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అంతర్జాతీయ అత్యయిక స్థితిగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కేసులు అధికమవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఈ వైరస్ 75 దేశాలకు వ్యాపించింది. 16వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. భారత్లో ఈ సంఖ్య నాలుగుకు చేరింది. ఒక్క కేరళలోనే మూడు కేసులు రాగా.. దిల్లీలో ఒకరు దీని బారినపడ్డారు. ఇదిలా ఉండగా.. దేశానికి చెందిన మెడికల్ పరికరాల తయారీ సంస్థ ట్రివిట్రాన్ హెల్త్కేర్.. మంకీపాక్స్ను గుర్తించేందుకు ఆర్టీపీసీఆర్ కిట్ను రూపొందించినట్లు ఇదివరకే ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు