Corona: కరోనా ‘గాలి’కి వెంటిలేషన్తో చెక్
గాలి ద్వారా కూడా కరోనా మరొకరికి సోకుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్లు, భౌతికదూరం, శానిటైజర్తో పాటు, ఇంటి లోపల గాలి, వెలుతురు కూడా ధారాళంగా ప్రసరించేలా ఉండాలని అంటున్నారు.
మాస్క్లు, భౌతికదూరంతో పాటు వెంటిలేషన్ తప్పనిసరి!
నూతన మార్గదర్శకాలు విడుదల
దిల్లీ: గాలి ద్వారా కూడా కరోనా మరొకరికి సోకుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్లు, భౌతికదూరం, శానిటైజర్తో పాటు, ఇంటి లోపల గాలి, వెలుతురు కూడా ధారాళంగా ప్రసరించేలా ఉండాలని అంటున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం వైరస్ వ్యాప్తి కట్టడికి నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటితో వైరస్ వ్యాప్తిని అరికట్టి.. మహమ్మారిని అణిచివేద్దామని పిలుపునిచ్చింది.
‘‘దేశంలో మహమ్మారి మళ్లీ పెట్రేగిన నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునే అలవాట్లను గుర్తుంచుకోవాలి. మాస్క్లు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజేషన్తో పాటు ఇళ్లల్లో వెంటిలేషన్ పెంచుకోవాలి. కరోనా సోకిన వ్యక్తి నుంచి వైరస్ సోకే ముప్పును వెంటిలేషన్ తగ్గిస్తుంది. సాధారణంగా ఇంట్లోని కిటికీలు, తలుపులు, ఎగ్జాస్ట్ సిస్టమ్స్తో దుర్వాసనలు బయటకు వెళ్తాయి. అదే ఆ ప్రాంతాల్లో ఫ్యాన్లు అమరిస్తే వైరస్తో కూడిన గాలి కూడా బయటకుపోయి ప్రమాదం తగ్గుతుంది’’ అని శాస్త్రీయ సలహా బృందం తెలియజేసింది.
తాజా సూచనలివే..
ఎక్కువ వెంటిలేషన్ వచ్చేలా..
* సాధారణంగా కొవిడ్ బాధితుడు మాట్లాడటం, తుమ్మడం, దగ్గడం, నవ్వడం లాంటివి చేసినప్పుడు నోటిలోంచి తుంపర్లు బయటకు వస్తాయి. ఇందులో రెండు రకాలు ఉంటాయి. పెద్దపెద్ద తుంపర్లు నేరుగా భూమి ఉపరితలం మీదకు పడతాయి. అలా పడిన ప్రదేశాలను ఇతరులు ముట్టుకుని, అదే చేతులతో ముఖం, నోటిని తాకితే వైరస్ సోకే ప్రమాదం ఉంది. అందుకే ఇంటిలోపల నేల, తలుపు హ్యాండిల్స్ వంటి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అంతేగాక, చేతులను తరచూ సబ్బుతో, శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలి. ఆ తుంపర్లు వైరస్ సోకిన వ్యక్తి నుంచి 2 మీటర్ల వరకు వ్యాపిస్తాయి.
* ఇక చిన్న చిన్న గాలి తుంపర్లు దాదాపు 10 మీటర్ల వరకు ప్రయాణిస్తాయి. ఎప్పుడూ మూసి ఉంచే గదుల్లో ఈ ఏరోసోల్స్ ప్రమాదకరంగా మారుతున్నాయి. వీటి ద్వారానే గాలి నుంచి వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. అందుకే ఇంట్లోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. కిటికీలు, తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంచడంతో పాటు, ఫ్యాన్లు అమర్చుకుంటే మరింత ప్రయోజనకరం.
* పనిచేసే కార్యాలయాల్లో ఏసీలు వేసి, తలుపులు, కిటకీలు మూసివేస్తారు. అలా చేయడం వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. అందుకే తలుపులు, కిటికీలు తెరిచి ఉంచడంతో పాటు ఎగ్జాస్ట్ ఫ్యాన్లను కూడా ఏర్పాటు చేయాలి.
రెండు మాస్క్లు మంచిది..
కరోనా కట్టడికి మాస్క్ అత్యవసరం. రెండు మాస్క్లతో మరింత ప్రయోజనం ఉంటుంది. ఒక సర్జికల్ మాస్క్తో పాటు కాటన్ మాస్క్ను కలిపి పెట్టుకోవాలి. సర్జికల్ మాస్క్ ఒక్కటే పెట్టుకున్నట్లయితే దాన్ని ఒకేసారి వినియోగించాలి. డబుల్ మాస్క్తోపాటు దాన్ని వాడినప్పుడు కనీసం 5 సార్లు ఉపయోగించుకోవచ్చు. అయితే పెట్టుకున్న ప్రతిసారీ దాన్ని ఎండలో ఆరబెట్టుకోవాలి.
కమ్యూనిటీ స్థాయి పరీక్షలు..
గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచాలి. దీనికోసం ఆశా, అంగన్వాడీ కార్యకర్తలకు రాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేయడంలో శిక్షణ ఇవ్వాలి. పాజిటివ్ వచ్చిన వ్యక్తులు తప్పనిసరిగా ఐసోలేషన్లో ఉండేలా చూసుకోవాలి. ఈ సూచనలను కచ్చితంగా పాటించి.. వైరస్ వ్యాప్తిని అడ్డుకుందామని నిపుణుల బృందం కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434