President: హైతి అధ్యక్షుడి దారుణ హత్య

కరేబియన్‌ దేశమైన హైతి అధ్యక్షుడు జొవెనెల్‌ మొయిసే దారుణ హత్యకు గురయ్యారు. అధ్యక్షుడు జొవెనల్‌ మొయిసే ఇంట్లోకి చొరబడ్డ కొందరు గుర్తుతెలియని దుండగులు అధ్యక్షుడితోపాటు ఆయన భార్యపై తుపాకులతో దాడికి పాల్పడినట్లు...

Published : 07 Jul 2021 18:01 IST

పోర్టో ప్రిన్స్‌: కరేబియన్‌ దేశమైన హైతి అధ్యక్షుడు జొవెనెల్‌ మొయిసే దారుణ హత్యకు గురయ్యారు. అధ్యక్షుడు జొవెనల్‌ మొయిసే ఇంట్లోకి చొరబడ్డ కొందరు గుర్తుతెలియని దుండగులు అధ్యక్షుడితోపాటు ఆయన భార్యపై తుపాకులతో దాడికి పాల్పడినట్లు ఆ దేశ తాత్కాలిక ప్రధాని క్లౌడే జోసెఫ్‌ వెల్లడించారు. ఈ దాడిలో అధ్యక్షుడు మృతిచెందగా ఆయన భార్య, దేశ మొదటి మహిళ మార్టిన్‌ మొయిసే తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ దాడిని జోసెఫ్‌ తీవ్రంగా ఖండించారు. ఇదో దుర్మార్గపు, అమానవీయ చర్యగా అభివర్ణించారు. దేశంలో రాజకీయ, ఆర్థిక స్థిరత్వం లేకపోవడంతో పాటు గ్యాంగ్‌ వార్‌లు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే జోవెనల్‌ మొయిసే హత్యకు గురయ్యారు. అధ్యక్షుడి హత్యతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చెలరేగనున్నట్లు సమాచారం అందుకున్న ఆ దేశ పోలీసు శాఖ.. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పేర్కొంది. హత్యపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని