Fine: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ₹10వేలు జరిమానా

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా, ఇద్దరు మంత్రులకు ఓ కేసులో హైకోర్టు జరిమానా విధించింది.

Updated : 06 Feb 2024 18:47 IST

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)కు ఆ రాష్ర్ట హైకోర్టు (Karnataka High Court)లో నిరాశ ఎదురైంది. 2022లో తనపై నమోదైన ఓ కేసును కొట్టియాలని అభ్యర్థిస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.  రోడ్లను దిగ్బంధించి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారంటూ నమోదైన కేసులో సీఎం సిద్ధరామయ్యకు రూ.10వేలు జరిమానా విధించింది. ఈ జాబితాలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలాతో పాటు మంత్రులు ఎంబీ పాటిల్‌, రామలింగారెడ్డి ఉన్నారు. అలాగే, మార్చి 6న ఎంపీ/ఎమ్మెల్యే ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుకావాలని ఆదేశించింది.

మార్చి నుంచి వందేభారత్‌ స్లీపర్‌.. తొలి రైలు ఈ రూట్‌లోనే!

గత భాజపా ప్రభుత్వ హయాంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప తన గ్రామంలో పనులకు 40శాతం కమీషన్‌ డిమాండ్‌ చేశారని ఆరోపిస్తూ సంతోష్‌ పాటిల్‌ అనే కాంట్రాక్టర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సీఎం రాజీనామాకు డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఆందోళన చేపట్టింది.  ఇందులోభాగంగా నాటి సీఎం బసవరాజ్‌ బొమ్మై నివాసాన్ని ముట్టడించేందుకు సిద్ధరామయ్యతో పాటు ఆ పార్టీ సీనియర్‌ నేతలు మార్చ్‌ చేపట్టగా.. రోడ్లను దిగ్బంధించి ప్రయాణికులకు  అసౌకర్యం కలిగించారంటూ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలన్న సీఎం సిద్ధరామయ్య అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు  ప్రజాప్రతినిధులు కూడా నిబంధనలు పాటించాలని సూచించింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు