ముంబయి, నాగ్పూర్లలో కఠిన ఆంక్షలు
దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తుంటే మహారాష్ట్రలో మాత్రం కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా ప్రారంభం నుంచి ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి.
కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం
ముంబయిలో మాస్కుల కోసం మార్షల్స్
ముంబయి: దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తుంటే మహారాష్ట్రలో మాత్రం కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా ప్రారంభం నుంచి ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ఈ నేపథ్యంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతుండటంతో మహా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కొవిడ్ నిబంధనలను కఠినతరం చేసింది. శుక్రవారం నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్ఎంసీ) కూడా కొత్త నిబంధనలను ప్రకటించింది. హోటళ్లలో 50శాతం వినియోగదారులు, అంత్యక్రియలకు 20 మంది మాత్రమే ఉండాలని ఎన్ఎంసీ అధికారులు వెల్లడించారు. ఒక భవనంలో 5 కంటే ఎక్కువ కరోనా కేసులుంటే ఆ భవనాలకు సీల్ వేస్తామని తెలిపారు.
సుమారు 75 రోజుల తర్వాత మహారాష్ట్రలో 5వేల కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కువ శాతం కేసులు అకోలా, నాగ్పూర్ పరిధిలో నమోదవుతున్నట్లు వారు వెల్లడించారు. యావత్మల్ జిల్లాలో పదిరోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అమరావతి జిల్లాలో వారాంతాల్లో లాక్డౌన్ విధిస్తున్నట్లు కలెక్టర్ శైలేశ్ నావల్ గురువారం ప్రకటించారు. పరిస్థితి మరింత చేజారకముందే ప్రజలు మేలుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే గతంలో హెచ్చరించారు. మళ్లీ లాక్ డౌన్ విధించాలా? వద్దా అనేది ప్రజల చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు.
మాస్కులు ధరించేందుకు మార్షల్స్
మహారాష్ట్రలో కేసుల సంఖ్య ఒక్క సారిగా పెరగడంతో అధికారులు కట్టడి చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా చాలా మంది ప్రజలు మాస్కులు ధరించట్లేదని గుర్తించిన అధికారులు ప్రజల చేత మాస్కులు ధరించేలా చేసేందుకు మార్షల్స్ను నియమించారు. ముంబయిలో సుమారు 5వేల మంది మార్షల్స్ను దీని కోసం నియమించారు. వారిలో చాలా మందిని రైల్వే స్టేషన్లలో ఉంచామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం