India Corona: 81 వేలు దాటిన క్రియాశీల కేసులు..!

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కనిపిస్తోంది. ముందురోజు 10 వేలకు దిగువన ఉన్న కొత్త కేసులు.. మరోసారి 12 వేలు దాటాయి. క్రమేపీ పెరుగుతోన్న క్రియాశీల కేసులు 81 వేలు దాటి, ఆందోళన కలిగిస్తున్నాయి. 

Updated : 22 Jun 2022 10:09 IST

4 శాతానికి చేరువగా పాజిటివిటీ రేటు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ముందురోజు 10 వేలకు దిగువన నమోదైన కొత్త కేసులు.. మరోసారి 12 వేలు దాటాయి. క్రమేపీ పెరుగుతోన్న క్రియాశీల కేసులు 81 వేలు దాటి.. ఆందోళన కలిగిస్తున్నాయి. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

మంగళవారం 3.10 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 12,249 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. దాంతో పాజిటివిటీ రేటు 3.94 శాతానికి ఎగబాకింది. కొత్త కేసుల్లో సగానికి పైగా మహారాష్ట్ర(3,659), కేరళ(2,609) నుంచే వచ్చాయి. దిల్లీలో వెయ్యికి పైగా కొత్త కేసులు రాగా.. కర్ణాటక, తమిళనాడు, హరియాణా సహా పలు రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది.

ఇప్పటివరకూ దేశంలో 4.32 కోట్ల మందికి పైగా వైరస్ బారినపడగా.. అందులో 4.27 కోట్ల మందికి పైగా కోలుకున్నారు. నిన్న 9,862 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం మహమ్మారితో బాధపడుతోన్న వారి(క్రియాశీల కేసులు) సంఖ్య 81,687కి చేరింది. రికవరీ రేటు 98.60 శాతానికి తగ్గగా.. క్రియాశీల రేటు 0.19 శాతానికి పెరిగింది. 24 గంటల వ్యవధిలో 13 మరణాలు సంభవించాయి.

నిన్న 12.28 లక్షల మంది టీకా వేయించుకోగా.. మొత్తంగా 196 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని