India Corona: ఆగని కరోనా ఉద్ధృతి.. వరుసగా నాలుగో రోజూ 3 లక్షల పైనే!
దేశంలో కరోనా వైరస్ ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉంది. శనివారంతో పోలిస్తే కేసులు స్వల్పంగా తగ్గినప్పటికీ.. వరుసగా నాలుగో రోజూ మూడు లక్షలపైనే కొత్త కేసులు నమోదయ్యాయి....
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉంది. శనివారంతో పోలిస్తే కేసులు స్వల్పంగా తగ్గినప్పటికీ.. వరుసగా నాలుగో రోజూ మూడు లక్షలపైనే కొత్త కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో 18,75,533 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,33,533 మందికి వైరస్ సోకినట్లు తేలింది. పాజిటివిటీ రేటు 17.22% నుంచి 17.78% పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇక కొత్తగా మరో 525 మంది మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు. దీంతో రెండేళ్ల వ్యవధిలో 3.89 కోట్ల మందికి కరోనా సోకగా.. 4,89,409 మంది మరణించారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు సంఖ్య 21,87,205గా ఉంది. ఆ కేసుల రేటు 5.57 శాతానికి పెరిగింది. కొత్తగా మరో 2,59,168 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తంగా 3,65,60,650 కోట్ల మంది కరోనా నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 93.18 శాతానికి చేరింది. మరోవైపు శనివారం దేశవ్యాప్తంగా 71.10 లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు 1,61,92,84,270 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సువారిలో 4,15,77,103 మందికిపైగా టీకా తొలి డోసు తీసుకున్నారు. అలాగే మొత్తం 80,10,256 మందికి ప్రికాషనరీ డోసులు పంపిణీ చేశారు.
• మహారాష్ట్రలో కొత్తగా 46,393 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 416 మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు తేలింది. ఇక 48 మంది మహమ్మారి బారిన పడి మరణించారు. శనివారంతో పోలిస్తే రోజువారీ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గడం గమనార్హం.
• ముంబయిలో కొత్తగా 3,568 కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్యలో 28 శాతం తగ్గుదల నమోదైంది.
• గత వారం రోజులుగా దేశ రాజధాని దిల్లీలో కేసులు తగ్గుతున్నాయి. కానీ, ఆదివారం ఆ ట్రెండ్ బ్రేక్ అయ్యింది. శనివారంతో పోలిస్తే కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగి 11,486కు చేరింది. మరో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది జూన్ 5 తర్వాత ఈ స్థాయి మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. పాజిటివిటీ రేటు మాత్రం 21.48% నుంచి 16.36% పడిపోయింది.
• కేరళలో వైరస్ వ్యాప్తి ఆందోళనకర స్థాయిలో వ్యాపిస్తోంది. కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఆదివారం 45,136 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో రోజువారీ కేసుల సంఖ్య 30 వేల మార్క్ను దాటింది. కొత్తగా 30,744 కేసులు రికార్డయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం