India Corona: మూడు వేలకు దిగువనే కొత్త కేసులు..
దేశంలో కరోనా వైరస్ దాదాపుగా అదుపులోకి వచ్చింది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు వరుసగా మూడోరోజు 3 వేలకు దిగువనే నమోదయ్యాయి.
12-14 ఏళ్ల వయస్సువారికి ప్రారంభమైన టీకా పంపిణీ
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ అదుపులోకి వస్తోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు వరుసగా మూడోరోజు 3 వేలకు దిగువనే నమోదయ్యాయి. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..
మంగళవారం ఏడు లక్షలమందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,876 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ప్రస్తుతం దేశంలో మహమ్మారి వ్యాప్తి రెండేళ్ల కనిష్ఠానికి తగ్గి, ఊరటనిస్తోంది. 24 గంటల వ్యవధిలో 98 మంది మృతి చెందారు. ఇప్పటివరకూ 4.29 కోట్ల మందికి కరోనా సోకగా.. 5.16 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
రోజురోజుకూ క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 32,811(0.08 శాతం)గా ఉంది. నిన్న 3,884 మంది కోలుకోగా.. మొత్తం రికవరీలు 4.24 కోట్లు(98.82 శాతం) దాటాయి.
ఈ రోజు నుంచే 12-14 వయస్సువారికి టీకా..
దేశంలో కరోనా టీకా కార్యక్రమం దశలవారీగా కొనసాగుతోంది. ఈ రోజు నుంచి 12 నుంచి 14 ఏళ్ల వయస్సువారికి టీకా పంపిణీ ప్రారంభమైంది. వారికి బయోలాజికల్ ఇ తయారు చేసిన కార్బెవాక్స్ వేస్తున్నారు. ఈ దశలో సుమారు 7.11 కోట్ల మంది చిన్నారులు లబ్ధి పొందనున్నట్లు కేంద్రం అంచనావేస్తోంది. అలాగే 60 ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరికీ కూడా ప్రికాషనరీ డోసు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి వరకూ కేంద్రం 180 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేసింది. నిన్న 18.9 లక్షల మంది టీకా వేయించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమిత్ షా నకిలీ వీడియో కేసు.. గుజరాత్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేవానీ పీఏ అరెస్టు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నకిలీ వీడియోను ఫేస్బుక్లో షేర్ చేశారన్న ఆరోపణలపై ఓ కాంగ్రెస్ నేతను, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్తను అరెస్టు చేసినట్లు గుజరాత్ పోలీసులు మంగళవారం వెల్లడించారు. -
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
Anand Mahindra: సామాజిక మాధ్యమాల వేదికగా ఎప్పుడూ తన అభిప్రాయాలను పంచుకొనే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా మరో వీడియో పోస్ట్ చేశారు. -
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న కుమార్తెను.. ఆమె తండ్రి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకువచ్చాడు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర