కొవిడ్ సెకండ్ వేవ్: ఏప్రిల్లో గరిష్ఠానికి..
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా దేశంలో విపరీతంగా పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు భారత్లో కరోనా సెకండ్ వేవ్ ప్రవేశించిందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే దేశంలో ఫిబ్రవరి నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం కొవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తికి నిదర్శనమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తాజా నివేదికలో వెల్లడించింది...
నివేదిక వెల్లడించిన ఎస్బీఐ
దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా దేశంలో విపరీతంగా పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు భారత్లో కరోనా సెకండ్ వేవ్ ప్రవేశించిందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే దేశంలో ఫిబ్రవరి నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం కొవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తికి నిదర్శనమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తాజా నివేదికలో వెల్లడించింది. ‘ సెకండ్ వేవ్ ఫిబ్రవరి 15 నుంచి 100 రోజులు ఉండనుంది. దీంతో రానున్న ఏప్రిల్ మధ్య నాటికి దేశవ్యాప్తంగా వైరస్ తీవ్రరూపం దాల్చనుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది సెకండ్ వేవ్లో వైరస్ బారిన పడే అవకాశం ఉంది’ అని బ్యాంకు నివేదిక ద్వారా అంచనా వేసింది.
లాక్డౌన్, ఆంక్షలు విధించడం వైరస్ వ్యాప్తిపై అంతగా ప్రభావం చూపకపోవచ్చు. ఇప్పటికే పెరిగిపోతున్న పాజిటివ్ కేసుల వల్ల దేశంలో కొన్ని వ్యాపార రంగాలు ఆర్థికంగా క్షీణించాయి. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్, ఆంక్షలు విధించడంతో మరిన్ని వ్యాపార రంగాలు ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉంది. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒక్కటే సరైన మార్గంలా కనిపిస్తోందని ఎస్బీఐ పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 34 లక్షల డోసులను పంపిణీ చేస్తున్నారు. వీటిని రోజుకి 40 నుంచి 45 లక్షలకు పెంచినప్పటికీ.. 45 ఏళ్లకు పైన వారందరికీ టీకా అందించడానికి మరో నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఎస్బీఐ నివేదిక అంచనా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434