cryptocurrency: చట్టం తేకుండా క్రిప్టోపై పన్ను వేయడమేంటి? కేంద్రాన్ని నిలదీసిన కాంగ్రెస్!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వర్చువల్ డిజిటల్ ఆస్తుల బదిలీపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు పేర్కొనడం రాజకీయ దుమారానికి దారితీసింది.
దిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వర్చువల్ డిజిటల్ ఆస్తుల బదిలీపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు పేర్కొనడం రాజకీయ దుమారానికి దారితీసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది. క్రిప్టో కరెన్సీని చట్టబద్ధం చేశారా? అంటూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్దీప్ సూర్జేవాలా ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.
దేశంలో వర్చువల్ డిజిటల్ కరెన్సీ లావాదేవీలు భారీ స్థాయిలో జరుగుతున్నాయని, అందుకే పన్ను విధిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. వర్చువల్ డిజిటల్ ఆస్తుల బదిలీపై 30 శాతం చొప్పున పన్ను విధిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు 1 శాతం టీడీఎస్ విధించనున్నట్లు చెప్పారు. వర్చువల్ ఆస్తులను గిఫ్ట్ రూపంలో అందించినా అదే ట్యాక్స్ వర్తిస్తుందని స్పష్టంచేశారు.
దీనిపై కాంగ్రెస్ నేత సూర్జేవాలా స్పందించారు. ట్విటర్ వేదికగా కేంద్రాన్ని నిలదీశారు. క్రిప్టో కరెన్సీని చట్టబద్ధం చేశారా? అని ప్రశ్నించారు. క్రిప్టో కరెన్సీ బిల్లు తేకుండా పన్ను ఎలా వేశారని ప్రశ్నించారు. దీనిపై ఆర్థిక మంత్రి దేశానికి సమాధానం చెప్పాలని సూర్జేవాలా డిమాండ్ చేశారు. రెగ్యులేషన్ పరిస్థితి ఏంటి? క్రిప్టో ఎక్స్ఛేంజీల నియంత్రణ మాటేంటి? ఇన్వెస్టర్ల రక్షణ సంగతి ఏంటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. బడ్జెట్లో క్రిప్టో కరెన్సీ గురించి ప్రస్తావించినప్పటికీ.. దీనికి సంబంధించి ఎలాంటి చట్టమూ లేదని, ఇంతకుముందు కూడా దీనిపై ఎలాంటి చర్చా జరగలేదని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే తప్పుబట్టారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు క్రిప్టో కరెన్సీ గురించి తీవ్ర చర్చ జరిగింది. ఆ సమావేశాల్లోనే బిల్లు తీసుకొస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, ప్రభుత్వం ఎందుకో ఆగిపోయింది. మరోవైపు క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ సైతం ఆందోళన వ్యక్తంచేసింది. ఈ క్రమంలో బడ్జెట్లో డిజిటల్ కరెన్సీపై పన్ను వేయడంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!