Lalu prasad: దిల్లీ ఎయిమ్స్‌ ఎమర్జెన్సీ వార్డులో లాలూ!

ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ దిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. ఎమర్జెన్సీ వార్డులో ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు......

Published : 26 Nov 2021 22:21 IST

దిల్లీ: ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ దిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. ఎమర్జెన్సీ వార్డులో ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. జ్వరం, ఒంట్లో మగతగా ఉండటంతో శుక్రవారం ఆయన చేరినట్టు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఆయన్ను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆయన రక్త నమూనాలను పరీక్షల కోసం పంపామని, నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్టు వైద్యులు తెలిపారు.

దాణా కుంభకోణంతో ముడిపడి ఉన్న డుమ్కా ట్రెజరీ కేసులో నిందితుడిగా ఉన్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌.. ప్రస్తుతం బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. మరోవైపు, ఈ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఆయన.. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరయ్యేందుకు పట్నాకు వచ్చారు. బుధవారం పట్నా వీధుల్లో జీపు నడుపుతూ కనిపించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఓపెన్‌ టాప్‌ జీపులో చక్కర్లు కొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని