Lalu Yadav: ‘ఫిట్‌’గా ఉన్న లాలూ .. హడావుడిగా ఎయిమ్స్‌ నుంచి డిశ్చార్జ్‌..!

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం రాత్రి దిల్లీ ఎయిమ్స్‌లో చేరారు.

Updated : 23 Mar 2022 16:37 IST

దిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం రాత్రి దిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. కొన్ని గంటలపాటు ఆయన్ను పర్యవేక్షించిన వైద్యులు ‘ఫిట్‌’గా ఉన్నారని ధ్రువీకరించి, పొద్దుపొద్దున్నే 3.30 గంటలకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. దానికి ముందు ఆయన్ను అత్యవసర విభాగంలో పర్యవేక్షణలో ఉంచారు. 

‘లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నిన్న రాత్రి 9 గంటలకు ఎయిమ్స్‌కు వచ్చారు. ఆ తర్వాత ఆయన్ను అత్యవసర విభాగానికి తరలించాం. ఆయన్ను పరీక్షించిన మీదట ఫిట్‌గా ఉన్నారని తేలడంతో.. ఉదయం 3.30 గంటలకు డిశ్చార్జ్‌ చేశాం’ అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. తర్వాత రాంచీలోని రిమ్స్‌కు తరలించారు. అయితే ఆయన్ను అంత అంత పొద్దున్నే డిశ్చార్జ్‌ చేయాల్సిన పనేముందని ఆర్జేడీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 

ప్రస్తుతం లాలూ దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన గుండె, మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే మంగళవారం ఆరోగ్యం క్షీణించడంతో.. మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్‌కు వచ్చారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని