Lata Mangeshkar: లత పాడిన వాటిల్లో ఆ పాట నాకు చాలా ఇష్టం: ఎల్.కె.ఆడ్వాణీ
లతా మంగేష్కర్ ఆలపించిన ‘రామ్ భజన’ తన చరిత్రాత్మక రథయాత్రకు ‘సిగ్నేచర్ ట్యూన్’గా మారిందని భాజపా సీనియర్ నేత ఎల్.కె.ఆడ్వాణీ అన్నారు....
దిల్లీ: లతా మంగేష్కర్ ఆలపించిన ‘రామ్ భజన’ తన చరిత్రాత్మక రథయాత్రకు ‘సిగ్నేచర్ ట్యూన్’గా మారిందని భాజపా సీనియర్ నేత ఎల్.కె.ఆడ్వాణీ అన్నారు. ఆమె మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన మాజీ ఉప ప్రధాని.. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆమె పాడిన పాటల్లో తనకు నచ్చిన ఓ గీతాన్ని తెలియజేశారు.
ప్రపంచవ్యాప్తంగా లతా మంగేష్కర్ను ఆరాధించారని ఆడ్వాణీ తెలిపారు. ఆమెను ఈ దేశం నిజంగా మిస్ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు నచ్చిన గాయకుల్లో లత ముందుంటారని పేర్కొన్నారు. ఆమెతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందని.. అది తన అదృష్టమని వ్యాఖ్యానించారు. సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర చేపట్టాలని సంకల్పించినప్పుడు లత స్వయంగా రామ్ భజన ఆలపించి తనకు పంపారని ఆడ్వాణీ గుర్తుచేసుకున్నారు. ‘‘రామ్ నామ్ మే జాదూ ఐసా.. రామ్ నామ్ మన్ భాయే.. మన్ కీ అయోధ్య తబ్ తక్ సూనీ, జబ్ తక్ రామ్ నా ఆయే’’ అంటూ సాగే చిరస్మరణీయ భజన తన రథయాత్రకు సిగ్నేచర్ ట్యూన్గా మారిందని తెలిపారు. 1990లో సాగిన రథయాత్ర.. భాజపాకు ప్రజల్లో విశేష ఆదరణను తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. అలాగే అయోధ్యలో రామమందిర నిర్మాణ డిమాండ్ కూడా ఈ యాత్రతోనే ఊపందుకుంది.
లతా మంగేష్కర్ నిర్మలమైన మనస్తత్వం గలవారని ఆడ్వాణీ గుర్తుచేసుకున్నారు. ఆమెతో సంభాషించిన ప్రతిసారీ తనకు ఎంతో ప్రేమ, ఆప్యాయతలు అందాయని తెలిపారు. ఆమె నిరాడంబరత, ప్రేమ తన హృదయాన్ని కదిలించాయన్నారు. ఆమె ఆలపించిన వేల సినిమా పాటల్లో ‘జ్యోతి కలశ్ ఛల్కే’ తనకు చాలా ఇష్టమని తెలిపారు. తన విజ్ఞప్తి మేరకు అనేక కార్యక్రమాల్లో లత ఈ పాటను పాడి వినిపించారని గుర్తుచేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం