covid 3rd wave: మహారాష్ట్రలో జులై-ఆగస్టులో..
కరోనా వైరస్ సెకండ్ వేవ్ ధాటికి మహారాష్ట్ర వణికిపోతోంది. ఈ నేపథ్యంలో వచ్చే రెండు నెలల్లో మహారాష్ట్ర థర్డ్ వేవ్ ప్రభావాన్ని చవిచూడవచ్చని ఆరాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది.
ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోన్న రాష్ట్ర ప్రభుత్వం
ముంబయి: కరోనా వైరస్ సెకండ్వేవ్ ధాటికి మహారాష్ట్ర వణికిపోతోంది. ఈ నేపథ్యంలో వచ్చే రెండు నెలల్లో మహారాష్ట్ర థర్డ్వేవ్ ప్రభావాన్ని చవిచూడవచ్చని ఆరాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఆ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధం అవుతున్నట్లు పేర్కొంది. ఇప్పటికే సెకండ్వేవ్ ఉద్ధృతిని అదుపులోకి తెచ్చేందుకు కఠిన ఆంక్షలను అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ నిత్యం 60వేల పాజిటివ్ కేసులు, దాదాపు 800 మరణాలు చోటుచేసుకుంటున్నాయి.
దేశంలో కొనసాగుతోన్న రెండో దశ విలయానికి మహారాష్ట్ర వణకిపోతోంది. గత నెల రోజులుగా సెకండ్వేవ్ తీవ్రత నుంచి కోలుకోలేకపోతున్న మహారాష్ట్రలో జులై-ఆగస్టు నెలలో థర్డ్వేవ్ విజృంభణ కొనసాగే అవకాశం ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్తోపే పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనసాతుగున్న వైరస్ విస్తృతిని బట్టి అంటువ్యాధుల నిపుణులు ఈ అంచనా వేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న సెకండ్వేవ్ ఉద్ధృతి మే చివరినాటికి గరిష్ఠస్థాయికి చేరుకుంటుందని అంచనా వేశామన్నారు. ఒకవేళ థర్డ్వేవ్ విజృంభణ కొనసాగితే దాన్ని ఎదుర్కోవడం రాష్ట్ర యంత్రాంగానికి ఒక సవాలేనని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో సవాళ్లు ఎదురైనప్పటికీ థర్డ్వేవ్ను కూడా ఎదుర్కొనేందుకు రాష్ట్రప్రభుత్వం అన్నివిధాల సన్నద్ధం అవుతున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా రాష్ట్రానికి సరిపడా ఆక్సిజన్ అందుబాటులో ఉంచుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మూడో దశ ఉద్ధృతి సమయంలో ఆక్సిజన్ కొరత ఏర్పడినట్లు ఫిర్యాదులు వస్తే సహించేది లేదని అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించామని రాజేష్ తోపే స్పష్టంచేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రతపై ముఖ్యమంత్రితో జరిగిన సమీక్షలో పలు అంశాలు చర్చించామని వెల్లడించారు. రాష్ట్రంలో కొవిడ్ విలయం కొనసాగుతున్న వేళ వాణిజ్య, కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యత కింద కొవిడ్ సంబంధిత సేవా కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారని చెప్పారు.
ఇదిలాఉంటే, మహారాష్ట్రలో గతకొన్నిరోజులుగా నిత్యం 65వేల పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. నిన్న ఒక్కరోజే అక్కడ 66,159 కేసులు నమోదు కాగా 771 మంది మృత్యువాతపడ్డారు. ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 3లక్షల 86వేల పాజిటివ్ కేసులు, 3498 మరణాలు నమోదయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.