కరోనా బారిన మహారాష్ట్ర మంత్రులు!
మహారాష్ట్రలో గత కొన్నివారాలుగా రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రితో పాటు పలువురు మంత్రులు, నాయకులు వైరస్ బారినపడుతున్నారు.
రాష్ట్రంలో పెరుగుతోన్న వైరస్ ఉద్ధృతి
ముంబయి: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత కాస్త అదుపులోనే ఉన్నప్పటికీ మహారాష్ట్రలో మరోసారి విజృంభణ మొదలైంది. గత కొన్ని వారాలుగా రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రితో పాటు పలువురు మంత్రులు, నాయకులు వైరస్ బారినపడుతున్నారు. ముఖ్యంగా ముంబయి నగరంలో వైరస్ ఉద్ధృతి పెరగడంతో.. అక్కడ కరోనా మ్యుటేషన్ చెందిందా? అనే కోణంలోనూ నిపుణులు పరిశోధన చేపట్టారు.
మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత మరోసారి కలవరపెడుతోంది. రెండు నెలల విరామం తర్వాత రోజువారీ కేసుల సంఖ్య ఒక్కసారిగా ఐదు వేలకు చేరింది. ఈ నేపథ్యంలో తనకు వైరస్ నిర్ధారణ అయినట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ థోప్ ట్విటర్లో వెల్లడించారు. ఇక ఏడుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన సీనియర్ నేత, మంత్రి జయంత్ పాటిల్ కూడా వైరస్ పోకిన విషయాన్ని గురువారం వెల్లడించారు. రాష్ట్ర సహాయ మంత్రి ఓంప్రకాశ్ బాబారావ్ ఖడు తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి రాజేంద్ర సింగ్నే వైరస్ బారినపడినట్లు రెండు రోజుల క్రితమే ట్విటర్లో వెల్లడించారు. మరో ఎన్సీపీ నేత, మాజీ మంత్రి ఏక్నాథ్ ఖాడ్సే కూడా వైరస్ సోకిన విషయాన్ని తెలియజేశారు. అయితే, ప్రస్తుతం వీరందరి అరోగ్యం బాగానే ఉందని, తమతో సన్నిహితంగా మెలిగిన వారు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ముంబయితోపాటు విదర్భ, అమరావతి ప్రాంతాల్లో వైరస్ తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో ఆంక్షలు విధిస్తున్నారు. వైరస్ కట్టడికి ప్రజలు సహకరించకపోతే ముంబయిలో మరోసారి లాక్డౌన్ విధించాల్సి వస్తుందని నగర మేయర్ ఈ మధ్యే ప్రజలను హెచ్చరించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం