Presidential Election: రాష్ట్రపతి రేసుకు పవార్ నో.. తెరపైకి ఆ ఇద్దరి పేర్లు!
Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేసే లక్ష్యంతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిల్లీలో నిర్వహించిన కీలక భేటీ ముగిసింది.
దిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో (Presidential Election) విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేసే లక్ష్యంతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిల్లీలో నిర్వహించిన కీలక భేటీ ముగిసింది. రాష్ట్రపతి రేసులో దిగేందుకు ఎన్సీపీ అధినేత శరద్పవార్ నిరాకరించడంతో మమతా బెనర్జీ మరో ఇద్దరి పేర్లను ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే, ఇప్పటివరకు పవార్ విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉంటారంటూ కొనసాగిన ఊహాగానాలకు ఈ భేటీతో తెరపడినట్టయింది. మమత ప్రతిపాదనకు పవార్ నో చెప్పడంతో ఆమె బెంగాల్ మాజీ గవర్నర్ గోపాల్కృష్ణ గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా పేర్లను సూచించినట్టు తెలుస్తోంది. ఈ కీలక భేటీలో తొలుత విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పవార్ పేరును దీదీ ప్రతిపాదించగా.. ఇంకా తాను క్రియాశీల రాజకీయాల్లో కొనసాగాల్సి ఉన్నందున ఆయన తిరస్కరించినట్టు సమాచారం.
ఈ సందర్భంగా మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అన్ని ప్రతిపక్ష పార్టీలను సమావేశానికి ఆహ్వానించా. కొన్ని పార్టీలు హాజరయ్యాయి. విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించాం. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం ఉండాలని కోరాను. శరద్ పవార్ పేరును ప్రతిపాదించాను. విపక్షాలన్నీ ఆయన పేరునే ఏకగ్రీవంగా ప్రతిపాదించాయి. అయితే, పోటీకి ఆయన ఆసక్తిగా లేరు. శరద్ పవార్ ఒప్పుకోకపోతే మరోసారి సమావేశమై చర్చిస్తాం. ప్రతిపక్షపార్టీలన్నీ ఏకతాటిపై ఉన్నాయి. ఇతర పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతాం. ఇది మంచి శుభారంభం. కొన్ని నెలల తర్వాత కలిసి ఇలా సమావేశమయ్యాం. మళ్లీ భేటీ అవుతాం. ప్రజాస్వామ్య దేశంలో బుల్డోజింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. దేశంలో ప్రతి వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు’’ అని దీదీ అన్నారు.
రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు విపక్షాలు జూన్ 21 డెడ్లైన్గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈలోపు పలువురు నేతలతో కూడినబృందం సంప్రదింపులు జరపనుంది. శరద్ పవార్కు తృణమూల్ కాంగ్రెస్తో పాటు, వామపక్షాలు, కాంగ్రెస్, శివసేనతో సహా పలు పార్టీ మద్దతు తెలిపాయి. ఆయన తిరస్కరించడంతో వామపక్షాలు ప్రతిపాదిస్తున్న బెంగాల్ మాజీ గవర్నర్ గోపాల్కృష్ణ గాంధీ పేరు తెరపైకి వచ్చింది.
రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
మరోవైపు, రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 29తో గడువు ముగియనుంది. 30న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు జులై 2 గడువు విధించగా.. జులై 18న ఎన్నికలు జరగనుండగా.. 21న ఫలితాలు వెలువడతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
నోటా విజేతగా నిలిస్తే?
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?