ఇప్పుడు వెళ్తేనే మంచిది: సొంతూళ్లకు కూలీలు
కరోనా మహమ్మారి వివిధ రాష్ట్రాలను వణికిస్తోంది. చాప కింద నీరులా కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు
న్యూదిల్లీ: కరోనా మహమ్మారి వివిధ రాష్ట్రాలను వణికిస్తోంది. చాప కింద నీరులా కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో పొట్ట చేతపట్టుకుని కూలి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారి పరిస్థితి మళ్లీ అగమ్యగోచరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ పూర్తి లాక్డౌన్ విధిస్తారన్న భయాలతో సొంతూళ్లకు వెళ్లిపోవడమే మంచిదన్న నిర్ణయానికి వస్తున్నారు వలస కూలీలు. ఇప్పటికే పలువురు తిరిగి స్వరాష్ట్రాలకు పయనమవుతున్నారు.
అప్పుడు తీవ్ర ఇబ్బందులు
గతేడాది కరోనా మహమ్మారిని అరికట్టడానికి తీసుకున్న కఠిన నిర్ణయాల్లో లాక్డౌన్ ఒకటి. అయితే, ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా లాక్డౌన్ ప్రకటించడంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పనిదొరక్క, ఉండేచోటు లేక ఆకలితో అలమటించారు. కొందరు వందల కి.మీ. కాలినడకన సొంతూళ్లకు చేరుకున్నారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ చాలా మంది నగరాలు, పట్టణాలకు వచ్చి పని చేసుకోవడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. దిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ ఉండటంతో వలస కూలీలు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ ఆయా రాష్ట్రాలు పూర్తి లాక్డౌన్ ప్రకటిస్తే తమ పరిస్థితి ఏంటన్న ఆలోచనలో పడ్డారు. మరికొందరు ఇప్పుడే సొంతూళ్లకు వెళ్లిపోతే బాగుంటుందని భావించి నగరాలను వీడుతున్నారు.
‘‘ఇక్కడ ఇరుక్కుపోయే కన్నా, ఇప్పుడు సొంతూరు వెళ్లిపోతేనే మంచిది అనిపిస్తోంది’’ అని బిహార్కు చెందిన వలస కూలీ అభిప్రాయపడ్డాడు. దిల్లీ ప్రభుత్వం రాత్రి 10గంటల నుంచి ఉదయం 5గంటల వరకూ కర్ఫ్యూ విధించడంతో పనిదొరక్క వెళ్లిపోతున్నట్లు చెప్పాడు. గుజరాత్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సూరత్, అహ్మదాబాద్ల నుంచి పలువురు వలస కూలీలు తమ సొంత గ్రామాలకు పయనమవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు