Corona: మళ్లీ కొవిడ్ కలవరం.. 5.63శాతానికి పాజిటివిటీ రేటు
దేశంలో కరోనా (Corona) కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజా వ్యాప్తికి ఎక్స్బీబీ.1.16 (XBB.1.16) లేదా ఆర్ట్కురుస్ (Arcturus)గా పిలిచే కొత్త వేరియంట్ కారణమని వైద్యరంగ నిపుణలు అభిప్రాయపడుతున్నారు.
దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి (Corona Virus) మళ్లీ చాప కింద నీరులా వ్యాపిస్తుండటం కలవరపెడుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు అమాంతం పెరుగుతున్నాయి. అటు మరణాలు కూడా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 6,155 మంది కొవిడ్ (Covid 19) వైరస్ బారిన పడగా.. పాజిటివిటీ రేటు 5శాతం దాటింది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వైరస్ వ్యాపిస్తున్న ప్రాంతాలను (ఎమర్జెన్సీ హాట్స్పాట్స్) గుర్తించి దాని కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.
తాజా కొవిడ్ గణాంకాలు ఇలా ఉన్నాయి..
* 24 గంటల్లో కొత్త కేసులు - 6,155 (మొత్తం కేసులు 4.47 కోట్లు)
* యాక్టివ్ కేసులు - 31,194 (0.07శాతం)
* 24 గంటల్లో మరణాలు - 11 (ఇప్పటివరకు మొత్తం మరణాలు 5,30,954)
* రోజువారీ పాజిటివిటీ రేటు - 5.63శాతం
* మొత్తం కోలుకున్న వారు - 4.41కోట్లు
* రికవరీ రేటు - 98.74శాతం
ఇదీ చదవండి: పిల్లల్లో కరోనా కొత్త వేరియంట్ లక్షణాలు గుర్తింపు
తాజా వ్యాప్తికి ఎక్స్బీబీ.1.16 (XBB.1.16) లేదా ఆర్ట్కురుస్ (Arcturus)గా పిలిచే కొత్త వేరియంట్ కారణమని వైద్యరంగ నిపుణలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ఈ వేరియంట్కు సంబంధించి 100కు పైనే కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. గత వేరియంట్లతో పోలిస్తే ఎక్స్బీబీ.1.16 వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్యరంగ నిపుణులు హెచ్చరించారు. ఈ వేరియంట్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. -
రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్ కోసం వేట
మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. -
ఐసీయూల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించండి
ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. -
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం