Corona: మళ్లీ కొవిడ్‌ కలవరం.. 5.63శాతానికి పాజిటివిటీ రేటు

దేశంలో కరోనా (Corona) కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజా వ్యాప్తికి ఎక్స్‌బీబీ.1.16 (XBB.1.16) లేదా ఆర్ట్కురుస్‌ (Arcturus)గా పిలిచే కొత్త వేరియంట్‌ కారణమని వైద్యరంగ నిపుణలు అభిప్రాయపడుతున్నారు.

Updated : 08 Apr 2023 12:12 IST

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి (Corona Virus) మళ్లీ చాప కింద నీరులా వ్యాపిస్తుండటం కలవరపెడుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు అమాంతం పెరుగుతున్నాయి. అటు మరణాలు కూడా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 6,155 మంది కొవిడ్ (Covid 19) వైరస్‌ బారిన పడగా.. పాజిటివిటీ రేటు 5శాతం దాటింది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వైరస్‌ వ్యాపిస్తున్న ప్రాంతాలను (ఎమర్జెన్సీ హాట్‌స్పాట్స్‌) గుర్తించి దాని కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.

తాజా కొవిడ్‌ గణాంకాలు ఇలా ఉన్నాయి..

* 24 గంటల్లో కొత్త కేసులు - 6,155 (మొత్తం కేసులు 4.47 కోట్లు)

* యాక్టివ్‌ కేసులు - 31,194 (0.07శాతం)

* 24 గంటల్లో మరణాలు - 11 (ఇప్పటివరకు మొత్తం మరణాలు 5,30,954)

* రోజువారీ పాజిటివిటీ రేటు - 5.63శాతం

మొత్తం కోలుకున్న వారు - 4.41కోట్లు

* రికవరీ రేటు - 98.74శాతం

ఇదీ చదవండి: పిల్లల్లో కరోనా కొత్త వేరియంట్‌ లక్షణాలు గుర్తింపు

తాజా వ్యాప్తికి ఎక్స్‌బీబీ.1.16 (XBB.1.16) లేదా ఆర్ట్కురుస్‌ (Arcturus)గా పిలిచే కొత్త వేరియంట్‌ కారణమని వైద్యరంగ నిపుణలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ఈ వేరియంట్‌కు సంబంధించి 100కు పైనే కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. గత వేరియంట్‌లతో పోలిస్తే ఎక్స్‌బీబీ.1.16 వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్యరంగ నిపుణులు హెచ్చరించారు. ఈ వేరియంట్‌ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని