ఇంజిన్‌ నుంచి విడిపోయిన బోగీలు

పంజాబ్‌లోని సర్‌హింద్‌ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్‌ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు.

Published : 06 May 2024 03:17 IST

3 కి.మీ. ప్రయాణం అనంతరం గుర్తింపు

లుథియానా: పంజాబ్‌లోని సర్‌హింద్‌ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్‌ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. రైలు సర్‌హింద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి బయలుదేరిన తర్వాత ఈ ఘటన జరిగిందని. బోగీలు లేకుండా ఇంజిన్‌ 3 కిలోమీటర్లు ప్రయాణించినట్లు చెప్పారు. కీమెన్‌ సిబ్బంది దీన్ని గమనించి లోకోపైలట్‌ను అప్రమత్తం చేశారు. కప్లింగ్‌ ఊడిపోవడం వల్లే రైలు నుంచి బోగీలు విడిపోయినట్లు తెలుస్తోంది. ఇంజిన్‌ వెనక్కి తిరిగివచ్చిన తర్వాత బోగీలను అనుసంధానం చేసి పంపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని