Megha Parmar: కాంగ్రెస్లో చేరిన మరుసటి రోజే.. అంబాసిడర్గా తొలగింపు..!
పర్వతారోహకురాలు మేఘా పార్మర్ (Megha Parmar)ను బ్రాండ్ అంబాసిడర్గా తొలగిస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆమె కాంగ్రెస్లో చేరిన మరుసటి రోజే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం.
భోపాల్: మధ్యప్రదేశ్ (Madhya Pradesh) నుంచి ఎవరెస్ట్ పర్వత శిఖరాన్ని (Everest climber) అధిరోహించిన తొలి మహిళగా రికార్డు సృష్టించిన మేఘా పార్మర్ (Megha Parmar)కు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. ‘బేటీ బచావో బేటీ పడావో’, రాష్ట్ర డెయిరీ బ్రాండ్ సాంచికి ప్రచారకర్త (ambassador)గా ఉన్న ఆమెను ఆ బాధ్యతల నుంచి తొలగించింది. పార్మర్ కాంగ్రెస్లో చేరడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
మేఘా పార్మర్ (Megha Parmar) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మే 9న ఛింద్వాడాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ (Kamal Nath) సమక్షంలో ఆమె కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరారు. ఆ మరుసటి రోజే రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బేటీ బచావో బేటీ పడావోకు రాష్ట్ర అంబాసిడర్గా ఉన్న ఆమెను బాధ్యతల నుంచి తప్పించింది. ఇది జరిగిన కొద్ది రోజులకే తాజాగా మధ్యప్రదేశ్లోని శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పాల ఉత్పత్తుల బ్రాండ్ సాంచికి ప్రచారకర్తగా ఉన్న మేఘాను తొలగించింది. దీంతో ఇది కాస్తా విమర్శలకు దారితీసింది.
మేఘా పార్మర్ (Megha Parmar) కాంగ్రెస్లో చేరారన్న కారణంతోనే ఆమెను ప్రచారకర్తగా తొలగించారని భాజపా సర్కారుపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ‘‘ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి మేఘా.. యావత్ దేశం గర్వపడేలా చేశారు. అలాంటి వ్యక్తిని బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తప్పించారు. కాంగ్రెస్లో చేరడమే ఆమె చేసిన నేరమా?’’ పార్టీ నేత కేకే మిశ్రా.. ముఖ్యమంత్రి చౌహన్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
అటు తాజా పరిణామాలపై మేఘా పార్మర్ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. ‘‘నేను రైతు బిడ్డను. ఎవరెస్ట్ను అధిరోహిస్తానని కలలో కూడా ఊహించలేదు. కానీ, మాజీ సీఎం కమల్నాథ్ నాకు ఎంతో సాయం చేశారు. ఆర్థికంగా అండగా నిలిచారు. అందువల్లే నేను ఎవరెస్ట్ ఎక్కగలిగాను. సినిమా హీరోయిన్లను పక్కనబెట్టి.. అప్పటి కమల్నాథ్ ప్రభుత్వం ఓ రైతు బిడ్డనైన నన్ను బేటీ బచావో- బేటీ పడావోకు బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. కానీ, ఇప్పుడు భాజపా ప్రభుత్వం.. నన్ను ఆ బాధ్యతల నుంచి తొలగించింది. భాజపా బేటీ బచావో.. ఇప్పుడు బేటీ హఠావోగా మారింది’’ అని ఆమె మండిపడ్డారు. అయితే, మేఘా, కాంగ్రెస్ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. కాగా.. 2019 మే 22న మేఘా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి.. మధ్యప్రదేశ్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి మహిళగా నిలిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434