ఒబామా.. మీరు 6 ముస్లిం దేశాలపై బాంబుల వర్షం కురిపించలేదా?: నిర్మలా సీతారామన్
ప్రధాని మోదీ అమెరికా పర్యటన సమయంలో ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ మండిపడ్డారు. గతంలో ఆరు ముస్లిం దేశాలపై ఆయన బాంబుల వర్షం కురిపించారని విమర్శించారు.
దిల్లీ: భారత్లో మైనార్టీల హక్కులపై అమెరికాలో (USA) ప్రధాని మోదీకి (PM Modi) ఎదురైన ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సమర్థించారు. కానీ, ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama) వ్యాఖ్యలను మాత్రం ఆమె తీవ్రంగా ఖండించారు. వైట్ హౌస్లో మోదీ మీడియా సమావేశానికి ముందు ఒబామా ఓ అంతర్జాతీయ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇస్తూ.. ‘నేను ప్రధాని మోదీతో మాట్లాడితే.. భారత్లోని మైనార్టీ హక్కులు గురించి ప్రస్తావిస్తాను. వారి హక్కులను పరిరక్షించలేకపోతే.. భారత్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది’ అన్నారు. ఈ వ్యాఖ్యలను నిర్మలా సీతారామన్ తప్పుబట్టారు. భారత ప్రధాని అమెరికాలో పర్యటిస్తూ అక్కడ తన దేశం గురించి చెబుతున్న సమయంలో ఒబామా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆమె తెలిపారు.
దిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిర్మలాసీతారామన్ మాట్లాడుతూ.. ‘‘ ఒబామా వ్యాఖ్యలపై మాట్లాడేందుకు నేను చాలా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇది రెండు దేశాలతో ముడిపడి ఉన్న అంశం. మేం అమెరికాతో స్నేహం కోరుకుంటున్నాం. కానీ, అక్కడ కూడా భారత్లో మతస్వేచ్ఛ, మైనార్టీల హక్కుల గురించి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో ఆరు ముస్లిం దేశాలపై బాంబులతో విరుచుకుపడలేదా? 26,000 బాంబులను ప్రయోగించినట్లు లెక్కలు చెబుతున్నాయి. అలాంటి వ్యక్తి మాటలను ఎవరైనా విశ్వసిస్తారా?’’ అని సీతారామన్ వ్యాఖ్యానించారు.
‘సబ్కా సాథ్ సబ్కా వికాస్ అన్నదే’ కేంద్ర ప్రభుత్వ సిద్ధాంతమని, ఇదే విషయాన్ని ప్రధాని మోదీ కూడా అమెరికాలో నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పినట్లు సీతారామన్ గుర్తు చేశారు. అంతేగాని మత వివక్ష గురించి ఆయన మాట్లాడలేదన్నారు. కానీ, ఆ చర్చలో పాల్గొన్నవారు మాత్రం ఈ విషయాన్ని పక్కనపెట్టి సమస్యలు కాని వాటిని బూతద్దంలో పెట్టి పెద్దదిగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చిన దాదాపు 13 విదేశీ అవార్డుల్లో 6 అవార్డులు ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశాల నుంచే వచ్చాయన్నారు. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్పైనా నిర్మలాసీతారామన్ నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి విధానాలకు వ్యతిరేకంగా తాము గెలవలేమని భావించిన కొందరు.. దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు, అసందర్భ వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్కు అలవాటైపోయిందని మండిపడ్డారు.
ఇంతకీ మోదీ ఏం చెప్పారు?
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden)తో ద్వైపాక్షిక చర్చల అనంతరం జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడిన సంగతి తెలిసిందే. ‘మైనార్టీల హక్కులను మెరుగుపరచడానికి భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది?’ అని ఓ పాత్రికేయుడు ప్రశ్నించారు. దానికి ప్రధాని బదులిస్తూ ‘మనమంతా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యం మన రక్తంలో నిండిపోయింది. దానినే మనం శ్వాసిస్తున్నాం. అది మన రాజ్యాంగంలోనే ఉంది. మానవ విలువలు, హక్కులు లేకపోతే.. ప్రజాస్వామ్యం అనేదే ఉండదు. మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నప్పుడు.. వివక్ష అనే ప్రశ్నే ఉండదు’ అని ప్రధాని స్పష్టం చేశారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే నినాదం మీదే తమ ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. మతం, కులం, వయసు, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
లోక్సభ ఎన్నికలతో దేశవ్యాప్తంగా రాజకీయంగా వాడీవేడీ వాతావరణం నెలకొన్న సమయంలో పశ్చిమ్ బెంగాల్ (West Bengal)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. -
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
Sakshee Malikkh: లోక్సభ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ కుమారుడికి భాజపా టికెట్ ఇవ్వడాన్ని ప్రముఖ రెజ్లర్ సాక్షి మలిక్ తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయంతో కోట్లాది మంది ఆడపిల్లల మనోధైర్యాన్ని దెబ్బతీశారని భావోద్వేగానికి గురయ్యారు. -
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
2జీ స్పెక్ట్రమ్పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం