Kim Jong-Un: స్లిమ్గా మారిన కిమ్..?
బాహ్య ప్రపంచానికి అరుదుగా కనిపించే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ బరువు తగ్గినట్లు కనిపించిన ఫోటోలు మరోసారి వార్తల్లో నిలిచాయి.
కిమ్ ఆరోగ్యంపై మరోసారి చర్చ
సియోల్: బాహ్య ప్రపంచానికి అరుదుగా కనిపించే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్కు సంబంధించి ఏ విషయమైనా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. ఈమధ్య ఆయన బరువు తగ్గినట్లు కనిపించిన ఫోటోలు మరోసారి వార్తల్లో నిలిచాయి. దీంతో కిమ్కు ఆరోగ్య సమస్యలు మరింత ఎక్కువయ్యాయా? లేదా కావాలనే ఆయన బరువు తగ్గారా..? అనే చర్చ మరోసారి మొదలయ్యింది.
కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది. గతేడాది కొన్ని నెలలపాటు అజ్ఞాతంలోకి వెళ్లడం ఇందుకు మరింత బలాన్ని చేకూర్చింది. ఒకానొక సమయంలో కిమ్ మృతి చెందారనే వార్తలూ అంతర్జాతీయ మీడియాలో వచ్చాయి. తర్వాత వివిధ అధికారిక కార్యక్రమాల్లో కిమ్ పాల్గొన్న ఫోటోలను మీడియా విడుదల చేయడంతో అలాంటి వార్తలకు ముగింపు పలికారు. ఇదిలాఉండగా, ఈ మధ్యే జరిగిన పార్టీ పొలిట్బ్యూరో సమావేశానికి సంబంధించిన ఫోటోలను ఉత్తర కొరియా అధికారిక మీడియా విడుదల చేసింది. అందులో కిమ్ చాలా బరువు తగ్గినట్లు కనిపించారు. ఆయన కావాలనే బరువు తగ్గారా? లేదా అనారోగ్య కారణాల వల్ల సన్నబడిపోయారా? అన్న విషయంపై స్పష్టత లేదు. దీంతో కిమ్ ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలయ్యింది. అయితే, కిమ్ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడంలో భాగంగానే బరువు తగ్గి ఉంటారని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఉత్తర కొరియా అధినేతకు సంబంధించిన విషయాలపై పొరుగు దేశం దక్షిణ కొరియా ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతుంది. గతేడాది దక్షిణ కొరియా నిఘా వర్గాలు వారి ఎంపీలకు ఇచ్చిన నివేదిక ప్రకారం, కిమ్ బరువు దాదాపు 140కిలోలు ఉన్నట్లు భావిస్తున్నామని తెలిసింది. 2011లో అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి ఏటా కిమ్ దాదాపు 6 నుంచి 7కిలోల బరువు పెరిగినట్లు అంచనా వేసింది.
ఇదిలాఉంటే, పొరుగు దేశాలైన చైనా, రష్యాలో కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ.. ఉత్తర కొరియాలో ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ఆ దేశం చెబుతోంది. కానీ, వైరస్ లక్షణాలున్న వందల మందిని క్వారంటైన్లో ఉంచుతున్నట్లు వార్తలు వెలుబడుతున్నాయి. అరకొర ఆరోగ్య సదుపాయాలున్న ఉత్తర కొరియాలో ఇప్పటివరకు ఒక్కకేసు నమోదు కాలేదని పేర్కొనడం పట్ల ప్రపంచదేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో కరోనా వైరస్ విజృంభణ కారణంగా పలు దేశాలు విధించిన ఆంక్షలతో ఉత్తర కొరియా తీవ్ర ఆహార కొరత, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం